Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోనేషియాలో మొసళ్ల ఊచకోత.. ఏకంగా 300 మొసళ్లను చంపేశారు..

ఇండోనేషియాలోని పపువా ప్రావిన్స్‌లో 300 మొసళ్లను ఊచకోత కోశారు గ్రామస్తులు. తమ గ్రామస్తుడిని చంపేసిందనే కోపంతో.. ఏకంగా 300 మొసళ్లను చంపేశారు. వివరాల్లోకి వెళితే.. జనావాసాల మధ్యలో ఓ మొసళ్ల ఎన్ క్లోజర్‌లో

Webdunia
సోమవారం, 16 జులై 2018 (17:45 IST)
ఇండోనేషియాలోని పపువా ప్రావిన్స్‌లో 300 మొసళ్లను ఊచకోత కోశారు గ్రామస్తులు. తమ గ్రామస్తుడిని చంపేసిందనే కోపంతో.. ఏకంగా 300 మొసళ్లను చంపేశారు. వివరాల్లోకి వెళితే.. జనావాసాల మధ్యలో ఓ మొసళ్ల ఎన్ క్లోజర్‌లో ఇటీవలే సుగితో (48) అనే వ్యక్తి గడ్డి కోయడానికి వెళ్లి పడిపోయారు. అందులో ఉన్న ఓ మొసలి అతన్ని చంపేసింది. అదే రోజు స్థానికులు అతనికి అంత్యక్రియలను నిర్వహించారు. 
 
అనంతరం సుగి కుటుంబం సహా గ్రామస్తులంతా కలసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనావాసాల మధ్య మొసళ్ల ఎన్‌క్లోజర్ ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపరిహారం చెల్లిస్తామని ఎన్‌క్లోజర్ సిబ్బంది చెప్పినప్పటికీ వారు ఏమాత్రం పట్టించుకోలేదు. అంతటితో ఆగకుండా కత్తులు, కట్టెలతో ఎన్‌క్లోజర్ వద్దకు వెళ్లి.. ఒక్కో మొసలిని బయటికి లాగి.. 300 మొసళ్లను చంపేశారు. గ్రామస్తులు చంపిన మొసళ్లలో పెద్ద పెద్ద మొసళ్లు, చిన్ని చిన్ని మొసళ్లు వున్నాయి.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments