Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇండోనేషియాలో ఘోర బోటు ప్రమాదం- 192 మంది ప్రయాణీకులు?

ఇండోనేషియాలో ఘోర బోటు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 192 మంది ప్రయాణీకులు గల్లంతయ్యారు. బోటులో సామర్థ్యం కంటే మూడు రెట్లు ఎక్కువ మంది ప్రయాణించడమే ప్రమాదానికి కారణమని అధికారులు చెప్తున్నారు. ఈ ఘటన లేక

Advertiesment
Lake Toba
, బుధవారం, 20 జూన్ 2018 (16:15 IST)
ఇండోనేషియాలో ఘోర బోటు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 192 మంది ప్రయాణీకులు గల్లంతయ్యారు. బోటులో సామర్థ్యం కంటే మూడు రెట్లు ఎక్కువ మంది ప్రయాణించడమే ప్రమాదానికి కారణమని అధికారులు చెప్తున్నారు. ఈ ఘటన లేక్ తోబాలో సంభవించింది. ఈద్ సంబరాల నేపథ్యంలో భారీ స్థాయిలో సరస్సుకు పర్యాటకులు వచ్చారు. ప్రస్తుతం సుమత్రా దీవుల్లో వాతావరణం ప్రతికూలంగా ఉంది. 
 
అయితే బోటులో ప్రయాణీకుల సంఖ్య అధికం కావడంతో బోటు ప్రమాదానికి గురైంది. ఇప్పటి వరకు కేవలం 18 మందిని మాత్రమే రక్షించారు. అయితే ఈ విషాదంలో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారన్న విషయం కూడా స్పష్టంగా తెలియదు. గజ ఈతగాళ్లు, అండర్‌వాటర్ డ్రోన్‌లు గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 
 
లేక్ తోబా సుమారు 450 మీటర్ల లోతు వుంటుందని.. బోటు ఏ ప్రాంతంలో ముగిందనే విషయాన్ని ఇంకా నిర్ధారించలేదని గల్లంతైన వారి కోసం ముమ్మరంగా ఈతగాళ్లు సరస్సులో గాలిస్తున్నారని పోలీసులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొత్త రూ.2వేలు, రూ. 200 నోట్లు చిరిగితే.. బ్యాంకులు తీసుకోవట్లేదు.. ఎందుకంటే?