Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇండోనేషియా టోర్నీ : ఫైనల్‌కు చేరిన సైనా నెహ్వాల్

ఇండోనిషియా బ్యాడ్మింటన్ మాస్టర్స్ చాంపియన్స్ ట్రోఫీలో భారత షట్లర్ సైనా నెహ్వాల్ దుమ్మురేపుతోంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆమె విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.

ఇండోనేషియా టోర్నీ : ఫైనల్‌కు చేరిన సైనా నెహ్వాల్
, శనివారం, 27 జనవరి 2018 (18:38 IST)
ఇండోనిషియా బ్యాడ్మింటన్ మాస్టర్స్ చాంపియన్స్ ట్రోఫీలో భారత షట్లర్ సైనా నెహ్వాల్ దుమ్మురేపుతోంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆమె విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన రట్చనోక్‌ ఇంతనాన్‌పై సైనా ఘన విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. 
 
మూడుసార్లు ఇండోనేషియా మాస్టర్స్ చాంపియన్‌షిప్ కైవసం చేసుకున్న మాజీ వరల్డ్ నం.1 సైనా.. తాజా గేమ్‌లో రట్చనోక్‌పై 21-19, 21-19 పాయింట్స్‌తో విజయం నమోదుచేసింది. 48 నిముషాల్లోనే ఆటను ముంగించేయడం గమనార్హం. 
 
ఫైనల్‌లో బ్యాడ్మింటన్ ప్రపంచ నెం.1 తాయ్ త్జుయింగ్‌తో గానీ, చైనీస్ ఎనిమిదో సీడ్ హే బింగ్జియావోతో గానీ తలపడనుంది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో సైనా 21-13, 21-19 స్కోరుతో వరుస గేముల్లో సింధుపై ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

థర్డ్ టెస్ట్ మ్యాచ్ : విజయం దిశగా సౌతాఫ్రికా