Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సైనా నెహ్వాల్ మళ్లీ గురువుకు చేరువైంది.. గోపిచంద్ అకాడమీలో మళ్లీ ట్రైనింగ్

ప్రపంచ బ్యాడ్మింటన్ టోర్నీల్లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ మెరుగ్గా ఆడకపోవడం ద్వారా పరాజయం పాలవుతోంది. దీంతో కోచ్‌ను మార్చేయాలనే నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా సైనా నెహ్వాల్ మూడేళ్ల విరామం త

సైనా నెహ్వాల్ మళ్లీ గురువుకు చేరువైంది.. గోపిచంద్ అకాడమీలో మళ్లీ ట్రైనింగ్
, సోమవారం, 4 సెప్టెంబరు 2017 (11:09 IST)
ప్రపంచ బ్యాడ్మింటన్ టోర్నీల్లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ మెరుగ్గా ఆడకపోవడం ద్వారా పరాజయం పాలవుతోంది. దీంతో కోచ్‌ను మార్చేయాలనే నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా సైనా నెహ్వాల్ మూడేళ్ల విరామం తర్వాత శిక్షణ కోసం గోపీచంద్ అకాడమీలో చేరింది. గతవారం గ్లాస్గోలో వరల్డ్ ఛాంపియన్‌ఫిప్ సందర్భంగా కోచ్‌తో మాటలు కలిపిన సైనా.. ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటోంది. 
 
మూడేళ్ల మూడేళ్ల క్రితం గోపీచంద్ అకాడమీని వీడిన సైనా నెహ్వాల్.. 2014, సెప్టెంబర్ 2 నుంచి బెంగళూరులో విమల్ కుమార్ దగ్గర శిక్షణ పొందింది. విమల్ దగ్గర ఉన్న సమయంలోనే సైనా వరల్డ్ నెంబర్ వన్‌గా అవతరించింది. ఆల్ ఇంగ్లండ్ ఫైనల్ చేరడంతోపాటు వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో రెండు పతకాలు సాధించింది. కానీ గాయాల కారణంగా ఆమె ఆటతీరు కాస్త మందగించింది. 
 
అంతకుముందు గోపిచంద్ శిక్షణలో రాటుదేలిన సైనా నెహ్వాల్ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుకుంది. ఇప్పటికే ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన తొలి భారత షట్లర్‌గా రికార్డు నెలకొల్పింది. కోచ్‌గా గోపిచంద్, క్రీడాకారిణిగా సైనా నెహ్వాల్.. బ్యాడ్మింటన్‌‍కు చక్కని గుర్తింపు తీసుకొచ్చారు. కానీ గత మూడేళ్ల పాటు సైనా చిన్ననాటి కోచ్ గోపిచంద్‌కు దూరంగా వుంది. గోపిచంద్ ట్రైనింగ్‌కు దూరమైన సైనా నెహ్వాల్, మళ్లీ సొంత గూటికి చేరుకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పరువు పోగొట్టుకున్న శ్రీలంక... భారత్ క్లీన్ స్వీప్