Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొండ‌ప‌ల్లి ఖిల్లాలో క్లీన్ ఇండియా - 750 కేజీల వ్య‌ర్థాల‌ ఏరివేత‌

Webdunia
గురువారం, 7 అక్టోబరు 2021 (17:51 IST)
ఆజాదీకా అమృత్ మ‌హోత్స‌వంలో భాగంగా కొండ‌ప‌ల్లి ఖిల్లాపై యువ‌త క్లీన్ ఇండియా కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్రం పిలుపుతో యువ‌త స్పందించారు. క్లీన్ ఇండియా ప్రోగ్రామ్ లో భాగంగా ఇబ్రహీంపట్నం మండలంలోని చ‌రిత్రాత్మ‌క‌మైన కొండపల్లి ఖిల్లాలో పారిశుధ్య‌ప‌నులు చేప‌ట్టారు.

ఖిల్లా  ప్రాంగణంలో చిత్తు కాగితాలు, ప్లాస్టిక్ క‌వ‌ర్లు ఏరివేశారు. 750 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలను పొగు చేసి, వాటిని కొండపల్లి ఖిల్లాకు దూరంగా  గార్బేజ్ ఏరియాలో డంప్ చేశారు. కృష్ణదేవరాయ యూత్ ఆర్గనైజేషన్, మ‌దర్ తెరిస్సాచారిట‌బుల్ ట్రస్ట్ స‌భ్యులు ఇందులో పాల్గొన్నారు. నెహ్రూ యువ  కేంద్ర విజయవాడ  యూత్ ఆఫీసర్ సుంకర రాము  పాల్గొని ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి భూమిని కాపాడాలని పిలుపునిచ్చారు.

ఈ కార్య‌క్ర‌మంలో సుంక‌ర రాము,ఎన్.వై.కె. యూత్ ఆఫీస‌ర్, విజ‌య‌వాడ, బి.వినోద్ కుమార్, కృష్ణ‌దేవ‌రాయ యూత్ ఆర్గ‌నైజేషన్, సుధ‌ కోయ‌, మ‌ద‌ర్ థెరెస్సా ఛారిట‌బుల్ ట్ర‌స్ట్ స‌భ్యులు పాల్గొన్నారు. నెహ్రూయువ కేంద్రం వాలంటీర్లు మెహన్,వెంకన్న బాబు, సుజాత, మెదుగు బాబు, గోపాల్ ,నవీన్, అభినేష్ స్టేడియం హౌస్ కీపింగ్ వర్కర్స్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments