Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొండ‌ప‌ల్లి క‌ళాకారుడికి వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డ్

కొండ‌ప‌ల్లి క‌ళాకారుడికి వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డ్
, శుక్రవారం, 9 జులై 2021 (21:27 IST)
కొండ‌ప‌ల్లి బొమ్మ‌ల‌ను త‌యారు చేసే క‌ళాకారుడు కూరేళ్ళ వెంక‌టా చారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 
వై.యస్.ఆర్.అచీవ్ మెంట్ అవార్డు అందించింది. ఈ సంద‌ర్బంగా క‌ళాకారుడు వెంక‌టాచారిని ఘ‌నంగా స‌న్మానించారు.

గొల్లపూడి బీసీ భవన్లో విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఛాంబర్లో చైర్మన్ తోలేటి శ్రీకాంత్ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అవార్డ్ వెంకటాచారికి  రావడం విశ్వబ్రాహ్మణ జాతికే గర్వకారణ‌మ‌న్నారు.

కొండపల్లి విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు వేల్పుకొండ శ్రీనివాస్, కత్తురోజు రామకృష్ణ ,తుమాటి కృష్ణమాచారి, వై.సి.పి.మైనారిటీ రాష్ట్ర కార్యదర్శి పఠాన్ కరీంఖాన్, బీసీ సంఘ నాయకులు వెంకటేశ్వరావు, అంకినీడు గారు ,పెదప్రోలు బ్రహ్మం, జవ్వాది సుధీర్ త‌దిత‌రులు ఈ స‌న్మాన కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్రికెట్‌ ఆడిన సీఎం జగన్‌: బ్యాట్​పట్టి రెండు బంతులు ఆడారు..