Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులో ఏడేళ్ల పాపపై అత్యాచారం... నిందితుడి కోసం గాలింపు...

Webdunia
బుధవారం, 30 జనవరి 2019 (12:53 IST)
దేశంలో స్త్రీల భద్రతకు ముప్పు వాటిల్లుతోంది, అత్యాచార దుర్ఘటనలు మరిన్ని జరుగుతున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు, మద్యం తాగి పసిపిల్లలను కూడా విడిచిపెట్టడం లేదు. ఇలాంటి ఘటన గుంటూరు జిల్లాలోని రెంటచింతల మండలం తుమురుకోటలో చోటుచేసుకుంది. 
 
జయరాజ్ అనే వ్యక్తి బాగా మద్యం తాగి కన్నబిడ్డ వయస్సు ఉన్న ఏడేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లాడు. అక్కడ అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలికకు తీవ్రంగా రక్తస్రావం కావడంతో తల్లిదండ్రులు ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు బాలిక పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. ఏం జరిగిందని ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. నేరస్థుడిని పట్టుకోవడానికి అతని ఇంటికి వెళితే అప్పటికే పరారయ్యాడు.
 
స్థానికులు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. బాధితురాలు బంధువులతో కలిసి స్థానికులు కూడా మాచర్ల బస్టాండు వద్ద ఆందోళన చేపట్టారు. పోలీసులు ఆందోళన విరమించాలని వేడుకున్నా ప్రయోజనం లేకపోయింది. నిందితుడిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments