Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో పుర, నగరపాలక ఎన్నికలకు 9,308 కేంద్రాలు

Webdunia
సోమవారం, 1 మార్చి 2021 (10:50 IST)
ఏపీలో మార్చి 10ననిర్వహించనున్న పుర, నగరపాలక, నగర పంచాయతీ ఎన్నికలకు పురపాలక శాఖ ఏర్పాట్లు చేసింది. మొత్తం 12 నగరపాలికలు, 75 పురపాలికలు, నగర పంచాయతీల్లో మొత్తం 9,308 పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేసింది.

ఈ పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 91,17,511 మంది ఓటర్లున్నారు. ఎన్నికల విధుల కోసం 55,840 మంది సిబ్బంది అవసరమని గుర్తించింది. ఈ మేరకు పోలింగ్‌ కేంద్రాలు, పురపాలక సంఘాలవారీగా సిబ్బంది ఇతరత్రా వివరాలతో రూపొందించిన నివేదికను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు అందించింది.

అత్యధికం విశాఖలోనే...
* అత్యధికంగా విశాఖ జిల్లాలో 1,818 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేసింది. కృష్ణాలో 1,124, గుంటూరులో 1,078 పోలింగ్‌ కేంద్రాలున్నాయి.
* శ్రీకాకుళం జిల్లాలో అత్యల్పంగా 111 పోలింగ్‌ కేంద్రాలున్నాయి.
* నగర, పురపాలికలు, నగర పంచాయతీలవారీగా చూస్తే విశాఖలో 18,36,224 మంది ఓటర్లున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో కర్నూలులో 10,85,758, గుంటూరులో 10,77,617, కృష్ణాలో 10,76,374 మంది ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో కేవలం 96,574 మంది ఓటర్లున్నారు.
పూర్తికాని సిబ్బంది కేటాయింపు
ఎన్నికల నిర్వహణ కోసం 55,840 మంది సిబ్బంది అవసరమని పురపాలక శాఖ గుర్తించింది. విధుల కోసం ఇప్పటివరకూ 48,181 సిబ్బందిని గుర్తించామని, 43,021 మంది కేటాయింపు పూర్తయిందని నివేదికలో పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments