Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో పుర, నగరపాలక ఎన్నికలకు 9,308 కేంద్రాలు

Webdunia
సోమవారం, 1 మార్చి 2021 (10:50 IST)
ఏపీలో మార్చి 10ననిర్వహించనున్న పుర, నగరపాలక, నగర పంచాయతీ ఎన్నికలకు పురపాలక శాఖ ఏర్పాట్లు చేసింది. మొత్తం 12 నగరపాలికలు, 75 పురపాలికలు, నగర పంచాయతీల్లో మొత్తం 9,308 పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేసింది.

ఈ పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 91,17,511 మంది ఓటర్లున్నారు. ఎన్నికల విధుల కోసం 55,840 మంది సిబ్బంది అవసరమని గుర్తించింది. ఈ మేరకు పోలింగ్‌ కేంద్రాలు, పురపాలక సంఘాలవారీగా సిబ్బంది ఇతరత్రా వివరాలతో రూపొందించిన నివేదికను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు అందించింది.

అత్యధికం విశాఖలోనే...
* అత్యధికంగా విశాఖ జిల్లాలో 1,818 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేసింది. కృష్ణాలో 1,124, గుంటూరులో 1,078 పోలింగ్‌ కేంద్రాలున్నాయి.
* శ్రీకాకుళం జిల్లాలో అత్యల్పంగా 111 పోలింగ్‌ కేంద్రాలున్నాయి.
* నగర, పురపాలికలు, నగర పంచాయతీలవారీగా చూస్తే విశాఖలో 18,36,224 మంది ఓటర్లున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో కర్నూలులో 10,85,758, గుంటూరులో 10,77,617, కృష్ణాలో 10,76,374 మంది ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో కేవలం 96,574 మంది ఓటర్లున్నారు.
పూర్తికాని సిబ్బంది కేటాయింపు
ఎన్నికల నిర్వహణ కోసం 55,840 మంది సిబ్బంది అవసరమని పురపాలక శాఖ గుర్తించింది. విధుల కోసం ఇప్పటివరకూ 48,181 సిబ్బందిని గుర్తించామని, 43,021 మంది కేటాయింపు పూర్తయిందని నివేదికలో పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments