Webdunia - Bharat's app for daily news and videos

Install App

8 యేళ్ళ బాలికపై ఐదుగురు బాలురు సామూహిక అత్యాచారం

గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. ఎనిమిదేళ్ళ బాలికపై ఐదుగురు బాలురు సామూహికంగా అత్యాచారం చేశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన పట్టాభిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని విద్యానగర్‌లో ఈ నెల 24న జరిగింది.

Webdunia
సోమవారం, 30 ఏప్రియల్ 2018 (08:52 IST)
గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. ఎనిమిదేళ్ళ బాలికపై ఐదుగురు బాలురు సామూహికంగా అత్యాచారం చేశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన పట్టాభిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని విద్యానగర్‌లో ఈ నెల 24న జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. రెండో తరగతి చదువుతున్న బాలికను ఆరో తరగతి చదువుతున్న 10 - 12 ఏళ్ల వయసున్న ఐదుగురు బాలురు సమీపంలోని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు.
 
బాధిత కుటుంబం కొద్ది నెలల కిందటే బతుకుదెరువు కోసం క్రోసూరు మండలం నుంచి నగరానికి వలస వచ్చి విద్యానగర్‌లో నివాసం ఉంటోంది. బాలిక తండ్రి అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా, తల్లి ఇళ్లలో పాచి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. 
 
తమ కుమార్తె కనిపించకపోవడంతో తల్లి, బాలిక అక్క వెతుక్కుంటూ వెళ్తుండగా చెట్ల పొదల్లో అలికిడి కావడంతో అక్కడకు వెళ్లారు. వారిని చూసి బాలురు పరార్‌ కాగా బాధితురాలిని ఇంటికి తీసుకెళ్లారు. ఈ ఘటనలో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక, ఫోక్సో తదితర చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం