Webdunia - Bharat's app for daily news and videos

Install App

విష ప్రయోగంతో 60 వానరాలు మృతి

Webdunia
బుధవారం, 18 నవంబరు 2020 (19:44 IST)
మహబూబాబాద్ జిల్లాలో శనిగపురం శివారులో విషప్రయోగం కారణంగా 60 వానరాలు మృతి చెందాయి. వీటికి అటవీ శాఖ అధికారులు సాముహిక అంత్యక్రియలు నిర్వహించారు. మంగళవారం రాత్రి శనిగపురం గ్రామ శివారు గుట్టలో విషప్రయోగంతో కోతులను హతమార్చిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
ఈ ఘటనపై స్పందించిన బీజేపీ నాయకులు హనుమంతుని ప్రతిరూపంగా కొలిచే వానరాలను ఇలా విషప్రయోగం చేసి చంపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. వానరాలను హతమార్చడం హింసాత్మకమైన నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడడం మానవత్వానికి విరుద్దమని నాయకులు తెలిపారు.
 
ఈ ఘటనపై స్పందించిన అటవీశాఖ అధికారులు ఇలాంటి క్రూరత్వానికి తెగబడిన వారిని త్వరలో గుర్తిస్తామని తెలిపారు. వానరాల మృతిపై స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments