Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెల్లెమ్మ దెబ్బకు అన్నయ్యకు నిద్రలేని రాత్రులు .. వణికిపోతున్న తాడేపల్లి ప్యాలెస్!!

PNR
బుధవారం, 20 మార్చి 2024 (15:59 IST)
సొంతచెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్.షర్మిల తన అన్న, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి నిద్రలేకుండా చేస్తున్నారు. గత 2019లో జరిగిన ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి వచ్చేందుకు ఎంతో సాయం చేసిన చెల్లి షర్మిల.. ఇపుడు తమ పార్టీ ఓటమికి కారకురాలవుతారన్న భయంతో తాడేపల్లి ప్యాలెస్ పాలకులు వణికిపోతున్నారట. గత ఐదేళ్ళుగా వైకాపా అధికారంలో ఉంది. పైగా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రమైన ప్రజావ్యతిరేక ఉంది. ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వైవు వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు. అదేసమయంలో వైఎస్ షర్మిల రూపంలో కూడా వైకాపాకు ఎంతో కొంత నష్టం జరుగుతుందని వారు హెచ్చరిస్తున్నారు. 
 
ప్రస్తుతం వైకాపాలో షర్మిలను అభిమానించేవారు ఉన్నారు. అయితే, తాజాగా విశాఖపట్టణంలో కాంగ్రెస్ నిర్వహించిన సభతో ఆ పార్టీకి జవజీవాలు కల్పించారనే చర్చ సాగుతుంది. దీంతో వైకాపా ఓటు బ్యాంకులో 2 శాతం కాంగ్రెస్ పార్టీకి మళ్లినా... తమ పరిస్థితి ఏంటనే ఆందోళన వైకాపాలో కనిపిస్తుంది. అదే జరిగితే వైకాపాకు ఓటమి తథ్యమని వైకాపా నేతలే తమ అంతర్గత చర్చల్లో వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో తాడేపల్లి ప్యాలెస్‌లో వణుకు మొదలైందనే చర్చ జరుగుతుంది. వైకాపాపై షర్మిల ప్రభావం ఏ మేరక ఉందనేది ఎన్నికల ఫలితాలతో తేలనుంది. 

సంబంధిత వార్తలు

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

యాక్షన్ ఎంటర్టైనర్స్ గా శివ కంఠంనేని బిగ్ బ్రదర్ రాబోతుంది

రెండు పార్టులుగా ఫేస్తోన్న మిరాయ్ తో మళ్ళీ వెండితెరపైకి మనోజ్ మంచు

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎన్టీఆర్ నీల్’ వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం ప్రకటన

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments