Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెల్లెమ్మ దెబ్బకు అన్నయ్యకు నిద్రలేని రాత్రులు .. వణికిపోతున్న తాడేపల్లి ప్యాలెస్!!

PNR
బుధవారం, 20 మార్చి 2024 (15:59 IST)
సొంతచెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్.షర్మిల తన అన్న, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి నిద్రలేకుండా చేస్తున్నారు. గత 2019లో జరిగిన ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి వచ్చేందుకు ఎంతో సాయం చేసిన చెల్లి షర్మిల.. ఇపుడు తమ పార్టీ ఓటమికి కారకురాలవుతారన్న భయంతో తాడేపల్లి ప్యాలెస్ పాలకులు వణికిపోతున్నారట. గత ఐదేళ్ళుగా వైకాపా అధికారంలో ఉంది. పైగా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రమైన ప్రజావ్యతిరేక ఉంది. ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వైవు వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు. అదేసమయంలో వైఎస్ షర్మిల రూపంలో కూడా వైకాపాకు ఎంతో కొంత నష్టం జరుగుతుందని వారు హెచ్చరిస్తున్నారు. 
 
ప్రస్తుతం వైకాపాలో షర్మిలను అభిమానించేవారు ఉన్నారు. అయితే, తాజాగా విశాఖపట్టణంలో కాంగ్రెస్ నిర్వహించిన సభతో ఆ పార్టీకి జవజీవాలు కల్పించారనే చర్చ సాగుతుంది. దీంతో వైకాపా ఓటు బ్యాంకులో 2 శాతం కాంగ్రెస్ పార్టీకి మళ్లినా... తమ పరిస్థితి ఏంటనే ఆందోళన వైకాపాలో కనిపిస్తుంది. అదే జరిగితే వైకాపాకు ఓటమి తథ్యమని వైకాపా నేతలే తమ అంతర్గత చర్చల్లో వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో తాడేపల్లి ప్యాలెస్‌లో వణుకు మొదలైందనే చర్చ జరుగుతుంది. వైకాపాపై షర్మిల ప్రభావం ఏ మేరక ఉందనేది ఎన్నికల ఫలితాలతో తేలనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments