Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెల్లెమ్మ దెబ్బకు అన్నయ్యకు నిద్రలేని రాత్రులు .. వణికిపోతున్న తాడేపల్లి ప్యాలెస్!!

PNR
బుధవారం, 20 మార్చి 2024 (15:59 IST)
సొంతచెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్.షర్మిల తన అన్న, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి నిద్రలేకుండా చేస్తున్నారు. గత 2019లో జరిగిన ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి వచ్చేందుకు ఎంతో సాయం చేసిన చెల్లి షర్మిల.. ఇపుడు తమ పార్టీ ఓటమికి కారకురాలవుతారన్న భయంతో తాడేపల్లి ప్యాలెస్ పాలకులు వణికిపోతున్నారట. గత ఐదేళ్ళుగా వైకాపా అధికారంలో ఉంది. పైగా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రమైన ప్రజావ్యతిరేక ఉంది. ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వైవు వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు. అదేసమయంలో వైఎస్ షర్మిల రూపంలో కూడా వైకాపాకు ఎంతో కొంత నష్టం జరుగుతుందని వారు హెచ్చరిస్తున్నారు. 
 
ప్రస్తుతం వైకాపాలో షర్మిలను అభిమానించేవారు ఉన్నారు. అయితే, తాజాగా విశాఖపట్టణంలో కాంగ్రెస్ నిర్వహించిన సభతో ఆ పార్టీకి జవజీవాలు కల్పించారనే చర్చ సాగుతుంది. దీంతో వైకాపా ఓటు బ్యాంకులో 2 శాతం కాంగ్రెస్ పార్టీకి మళ్లినా... తమ పరిస్థితి ఏంటనే ఆందోళన వైకాపాలో కనిపిస్తుంది. అదే జరిగితే వైకాపాకు ఓటమి తథ్యమని వైకాపా నేతలే తమ అంతర్గత చర్చల్లో వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో తాడేపల్లి ప్యాలెస్‌లో వణుకు మొదలైందనే చర్చ జరుగుతుంది. వైకాపాపై షర్మిల ప్రభావం ఏ మేరక ఉందనేది ఎన్నికల ఫలితాలతో తేలనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments