Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహమంటే ఇదేనా? అలీ వంటి వ్యక్తులతో బంధుమిత్రులను కూడా నమ్మడం లేదు : పవన్

Webdunia
సోమవారం, 8 ఏప్రియల్ 2019 (17:46 IST)
సినీనటుడు, వైకాపా నేత అలీపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలీ వంటి వ్యక్తుల వల్ల మనుషులపై నమ్మకం పోతుందని అన్నారు. ఆయన సోమవారం ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, కష్టాల్లో అలీకి అండగా ఉన్నానని, ఆయన చెప్పినవారికి టికెట్లు ఇచ్చానని.. అయినా ఆయన జగన్‌తో చేతులు కలిపారన్నారు. 
 
స్నేహమంటే ఇదేనా అని పవన్ ప్రశ్నించారు. తనతో కలిసి పనిచేస్తానన్న అలీ.. మాట మత్రమైనా చెప్పకుండానే వైసీపీలో చేరిపోయారన్నారు. అలీ లాంటి వారి వల్ల.. ప్రజలను తప్ప బంధుమిత్రులను కూడా నమ్మడం లేదన్నారు. అదేసమయంలో అలీ చెప్పిన ఆయన బంధువుకు నరసారావు పేట ఎంపీ టిక్కెట్ కేటాయించామన్నారు. ఆయనకు మద్దతుగా తాము ప్రచారం చేస్తుంటే.. అలీ మాత్రం వైకాపా తరపున ప్రచారం చేస్తున్నారన్నారు. ఇదెక్కడి న్యాయం అని పవన్ ప్రశ్నించారు. 
 
అంతేకాకుండా, అలీనీ వైకాపా నేతలు వాడుకున్నారన్నారు. అలీకి ఎంపీ టికెట్‌ ఇస్తామంటే వైసీపీలో చేరాడని తెలిపారు. పైగా, అలీ వైకాపాలో చేరడానికి కారణం... ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు. జగన్ గెలుస్తాడు అని భావించి ఉండొచ్చని పవన్ అభిప్రాయపడ్డారు. ఏదిఏమైనా అలీ వంటి వ్యక్తుల వల్ల చివరకు బంధుమిత్రులను తాను నమ్మడం లేదనీ ప్రజలను మాత్రమే నమ్ముతున్నట్టు చెప్పారు.
 
ఇకపోతే, వైసీపీ అధినేత జగన్‌పై నిప్పులు చెరిగారు. తండ్రి శవం దొరక్కముందే సీఎం కావాలనుకున్న.. జగన్‌ రాష్ట్రానికి అవసరమా? అని మరోసారి ప్రశ్నించారు. కన్నబాబు లాంటి చెంచాలు అవసరం లేదన్నారు. వైఎస్‌ బావమరిది రవీంద్రనాథ్ రెడ్డి  సినిమా తీయాలని బెదిరించారని, జగన్ ఇంట్లో వాటా ఇమ్మంటే ఇస్తారా?.. బెదిరిస్తే తోలు తీస్తానని పవన్‌ హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments