Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహమంటే ఇదేనా? అలీ వంటి వ్యక్తులతో బంధుమిత్రులను కూడా నమ్మడం లేదు : పవన్

Webdunia
సోమవారం, 8 ఏప్రియల్ 2019 (17:46 IST)
సినీనటుడు, వైకాపా నేత అలీపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలీ వంటి వ్యక్తుల వల్ల మనుషులపై నమ్మకం పోతుందని అన్నారు. ఆయన సోమవారం ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, కష్టాల్లో అలీకి అండగా ఉన్నానని, ఆయన చెప్పినవారికి టికెట్లు ఇచ్చానని.. అయినా ఆయన జగన్‌తో చేతులు కలిపారన్నారు. 
 
స్నేహమంటే ఇదేనా అని పవన్ ప్రశ్నించారు. తనతో కలిసి పనిచేస్తానన్న అలీ.. మాట మత్రమైనా చెప్పకుండానే వైసీపీలో చేరిపోయారన్నారు. అలీ లాంటి వారి వల్ల.. ప్రజలను తప్ప బంధుమిత్రులను కూడా నమ్మడం లేదన్నారు. అదేసమయంలో అలీ చెప్పిన ఆయన బంధువుకు నరసారావు పేట ఎంపీ టిక్కెట్ కేటాయించామన్నారు. ఆయనకు మద్దతుగా తాము ప్రచారం చేస్తుంటే.. అలీ మాత్రం వైకాపా తరపున ప్రచారం చేస్తున్నారన్నారు. ఇదెక్కడి న్యాయం అని పవన్ ప్రశ్నించారు. 
 
అంతేకాకుండా, అలీనీ వైకాపా నేతలు వాడుకున్నారన్నారు. అలీకి ఎంపీ టికెట్‌ ఇస్తామంటే వైసీపీలో చేరాడని తెలిపారు. పైగా, అలీ వైకాపాలో చేరడానికి కారణం... ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు. జగన్ గెలుస్తాడు అని భావించి ఉండొచ్చని పవన్ అభిప్రాయపడ్డారు. ఏదిఏమైనా అలీ వంటి వ్యక్తుల వల్ల చివరకు బంధుమిత్రులను తాను నమ్మడం లేదనీ ప్రజలను మాత్రమే నమ్ముతున్నట్టు చెప్పారు.
 
ఇకపోతే, వైసీపీ అధినేత జగన్‌పై నిప్పులు చెరిగారు. తండ్రి శవం దొరక్కముందే సీఎం కావాలనుకున్న.. జగన్‌ రాష్ట్రానికి అవసరమా? అని మరోసారి ప్రశ్నించారు. కన్నబాబు లాంటి చెంచాలు అవసరం లేదన్నారు. వైఎస్‌ బావమరిది రవీంద్రనాథ్ రెడ్డి  సినిమా తీయాలని బెదిరించారని, జగన్ ఇంట్లో వాటా ఇమ్మంటే ఇస్తారా?.. బెదిరిస్తే తోలు తీస్తానని పవన్‌ హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments