Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రసెల్స్ పీనింగ్ బాయ్... నీటి వృథాకు అడ్డుకట్ట

Webdunia
సోమవారం, 8 ఏప్రియల్ 2019 (17:26 IST)
బెల్జియంలోని బ్రస్సెల్స్ నగరంలో పర్యాటకులను విశేషంగా ఆకర్షించే కళాఖండాల్లో మాన్నెకెన్-పిస్ (మూత్ర విసర్జన చేసే బాలుడి కాంస్య విగ్రహం) ఒకటి. 400 ఏళ్లనాటి ఈ విగ్రహం నుంచి రోజుకు 2.5 టన్నుల నీరు వృథాగా డ్రైనేజీలో కలిసిపోతోంది. బెల్జియంలో రోజుకు ఐదు కుటుంబాలు ఉపయోగించుకునే నీటితో ఇది సమానం. ఆ విగ్రహంలో అమర్చిన పైపుల్లో లోపం తలెత్తడం వల్లే నీరు వృథాగా పోతోంది. 
 
ఆ లోపాన్ని బ్రస్సెల్స్ అధికారులు ఇటీవలే గుర్తించారు. నీటి వృథాను అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇకపై ఆ నీటిని రీసైకిల్ చేసేలా చర్యలు తీసుకోవడం ద్వారా వృథాను అరికట్టనున్నట్టు నగర ఇంజినీర్ రెగిస్ కల్లెన్స్ తెలిపారు. 1619లో పోతపోసిన ఈ విగ్రహం చోరీకి గతంలో పలు ప్రయత్నాలు జరిగాయి. దీంతో చాలా కాలం క్రితమే అసలు విగ్రహాన్ని మ్యూజియంలో భద్రపరిచి పర్యాటకుల కోసం నకలు విగ్రహాన్ని అదే చోట ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments