Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెయిల్ పాలిష్ వాడుతున్నారా.. జాగ్రత్త..?

Webdunia
బుధవారం, 28 నవంబరు 2018 (16:06 IST)
అమ్మాయిల నాజూకైన చేతివేళ్లను లేత బెండకాయలతో పోలుస్తుంటారు. అంత అందమైన చేతివేళ్లకు గోళ్లు కూడా అంతే సొగసుగా ఉండాలి కదా.. తరచుగా సబ్బునీళ్లలో, వంట పనిలో మునిగిపోయిన వారికి గోళ్లు మొరటుగా తయారౌతాయి. 
 
నెయిల్‌పాలిష్‌ వాడడం వలన గోళ్ళు అనారోగ్యం పాలవుతాయి. కాబట్టి గోళ్ళకు నెయిల్ పాలిష్ వాడకుండా మానేస్తే మంచిదని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. దీంతో గోళ్ళకు ప్రాణ వాయువు శులభంగా లభిస్తుంది. మీ చేతి వేళ్ళను గోరువెచ్చని కొబ్బరినూనెతో వారానికి రెండుసార్లు మర్దన చెయ్యాలి. ఇలా చేయడం వలన  గోళ్లు ఆరోగ్యంగా ఎదుగుతాయి.
 
నెయిల్‌ పాలిష్‌ని అదేపనిగా వాడడం వలన కూడా గోళ్లు రంగు మారి అందవిహీనంగా తయారవుతాయి. అలా జరగకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించాలి. చర్మం మెత్తబడేలా చేసే లక్షణం నువ్వుల నూనెలో అధికంగా ఉంది. చేతిగోళ్లకు తరచుగా నువ్వులనూనెను రాయాలి. కొబ్బరినూనెను కూడా వాడొచ్చు. రోజూ దుస్తులు ఉతకాల్సి వస్తే మాత్రం చేతికి గ్లోవ్స్‌ ధరించాలి.. లేదంటే సబ్బు తాలూకు అవక్షేపాలు.. క్షారాలు చర్మాన్ని మొరటుగా మారుస్తాయి. 
 
అరకప్పు గోరువెచ్చని నీటిలో అరచెక్క నిమ్మకాయని పిండి అందులో 5 నిమిషాల పాటు చేతులను అలానే ఉంచి ఆ తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. సబ్బువాడకం మంచిది కాదు. కాస్త ఆరాక మాయిశ్చరైజర్‌ రాయాలి. ఇలా చేస్తే మీ గోళ్ళు ఆరోగ్యవంతంగా ఎదుగుతాయని వైద్యులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments