కొత్త ఆర్థిక సంవత్సరం 2020-21కిగాను వార్షిక బడ్జెట్ను కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం లోక్సభలో ప్రవేశపెట్టారు. ఆమె తన ప్రసంగంలో అనేక కీలకాంశాలను వెల్లడించారు. ముఖ్యంగా, వేతనజీవులకు శుభవార్త చెప్పారు. రూ.5 లక్షల వరకు ఆదాయం వున్నవారికి పన్ను చెల్లింపుల నుంచి పూర్తిమినహాయింపు కల్పించారు. అలాగే, దేశంలో సరికొత్త విద్యావిధానాన్ని తీసుకుని రానున్నట్టు ప్రకటించారు. డిజిటల్ చెల్లింపులను మరింతగా ప్రోత్సహిస్తామని ప్రకటించారు.
ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్.ఐ.సిని ప్రైవేటుపరం చేస్తామని, ఇందులోభాగంగా, కొంత వాటాను విక్రయిస్తామని తెలిపారు. అలాగే వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు వీలుగా అనేక ప్రోత్సాహకాలను ఆమె ప్రకటించారు. జీఎస్టీ విధానంతో పాటు.. ఆదాయపన్ను దాఖలు ప్రక్రియను మరింత సరళతరం చేయనున్నట్టు తెలిపారు. కాగా ఈ బడ్జెట్ ప్రసంగంలో ఉన్న ముఖ్యాంశాలను పరిశీలిస్తే,