Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీఎస్టీతో మంచే జరిగింది.. ఆదాయం పెరిగింది.. నిర్మలా సీతారామన్

Webdunia
శనివారం, 1 ఫిబ్రవరి 2020 (11:20 IST)
జీఎస్టీపై దేశంలో గతంలో వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో.. అదే జీఎస్టీతో దేశానికి మంచే జరిగిందని.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జీఎస్టీతో రాష్ట్రాల, కేంద్రం ఆదాయం పెరిగింది. ఎవరికీ నష్టం కలగలేదని చెప్పారు. ఒకే పన్ను, ఒకే దేశ విధానం మంచి ఫలితాలను ఇచ్చిందని చెప్పుకొచ్చారు. జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరిగాయని, కేంద్ర ఖజానాకు చేరుతున్న ఆ నిధులన్నీ, తిరిగి ప్రజోపయోగ సంక్షేమ కార్యక్రమాలకే ఖర్చు చేస్తున్నామని తెలిపారు. 
 
దార్శనికులైన అరుణ్ జైట్లీకి నివాళులు అర్పిస్తున్నామని నిర్మల పేర్కొన్నారు. ఇక ఆదాయాల పెంపు, కొనుగోలు శక్తి పెంచే దిశగా బడ్జెట్ వుంటుందన్నారు. దేశ ప్రజలకు సేవ చేయాలనే దీక్షతోనే ఈ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. మన ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా వున్నాయని చెప్పుకొచ్చారు. 
 
గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాయకత్వాన్ని దేశ ప్రజలు ముక్తకంఠంతో కోరుకున్నారన్నారు.  ప్రజలు ఇచ్చిన తీర్పుతో మరింత పునరుత్తేజంతో మోదీ నాయకత్వంలో దేశాభివృద్ధికి తామంతా పని చేస్తున్నామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రోజూ ఉదయం నా మూత్రం నేనే తాగాను, అప్పుడే ఆ రోగం తగ్గింది: నటుడు పరేష్ రావల్ (video)

అక్టోబరు 31వ తేదీన పెళ్లి చేసుకుంటావా? ప్రియురాలికి సినీ దర్శకుడు ప్రపోజ్ (Video)

'ఎన్నో బాయ్‌ఫ్రెండ్' అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు : శృతిహాసన్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ల కిష్కింధపురి ఫస్ట్ లుక్

Sridevi: ఆరోజునే 3డీలోనూ జగదేక వీరుడు అతిలోక సుందరి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments