టీటీడీ ఛైర్మ‌న్‌గా మ‌ళ్లీ వై.వీ.సుబ్బారెడ్డే!

Webdunia
శనివారం, 17 జులై 2021 (10:56 IST)
టీటీడీ ఛైర్మన్‌గా మ‌ళ్ళీ వైవీ సుబ్బారెడ్డికే ఛాన్స్ వ‌చ్చింది. కాదు కాదంటూనే, సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చివ‌రికి సుబ్బారెడ్డి ప‌ద‌వీకాలం పొడిగింపున‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి గడువు ఈ నెల 21తో ముగుస్తోంది. దీంతో కొత్త పాలకమండలి ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది.

మరోసారి వైవీ సుబ్బారెడ్డి పదవని జగన్ రెన్యువల్ చేస్తారా? లేదా కొత్త వారికి పదవి అప్పగిస్తారా? అని ఇంత‌కాలం ఉత్కంఠ నెల‌కొంది. టీటీడీ ఛైర్మన్‌గా అనేక మంది పేర్లు వినిపించ‌డంతో, వైవీకి వేరే ప‌ద‌వి అప్పగిస్తారనే చర్చ కూడా పార్టీలో నడిచింది. కానీ, చివ‌రికి మరోసారి ప్రస్తుత టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికే ఆవకాశం ఇచ్చారు. 
 
నేడు టీటీడీ పాలకమండలి సమావేశం కాబోతున్న త‌రుణంలో ఆయ‌న ఎక్స్‌టెన్ష‌న్ వార్త రావ‌డంతో...అందిరిలో టెన్ష‌న్ తొల‌గింది. రేపు స్వామివారి ఆలయంలో భోగశ్రీనివాసమూర్తికి ఏకాంతంగా సహస్రకలశాభిషేకాన్ని అర్చకులు నిర్వహించనున్నారు.

22వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జేష్ఠాభిషేకం ఉత్సవాలు జరగనున్నాయి. 24వ తేదీన వర్చువల్ ఆర్జిత సేవలను కూడా టీటీడీ రద్దు చేసింది. నేడు జరగనున్న చివరి పాలకమండలి సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారన్నదీ ఆసక్తికరంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sesh Adavi: డెకాయిట్‌ చిచ్చుబుడ్డి ఫుల్ సాంగ్ లో మెరిసిన అడివి శేష్, జోనితా గాంధీ, పవన్ సింగ్

Prakash Raj: ప్రకాశ్ రాజ్ కు మాత్రుమూర్తి సువర్ణలత వియోగం

Niharika: విజయ్ దేవరకొండ తో రిలేషన్ షిప్ పై క్లారిటీ ఇచ్చిన నీహారిక కొణిదెల

Ramcharan: పెద్ది ప్రత్యేక ప్రదర్శనలకు కౌంట్‌డౌన్ - మరోవైపు వాయిదాపై అనుమానాలు ?

SITSA: దక్షిణ భారత టీవీ పరిశ్రమకు కొత్త ఊపిరి సిట్సా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రవీనా టాండన్, రాషా థడానీలతో తల్లి-కూతుళ్ల నమ్మకాన్ని వేడుక చేసిన గార్నియర్ కలర్ నాచురల్స్

మహిళల్లో రుతుక్రమం ఎందుకు ఆలస్యం, ప్రధాన కారణాలు ఏమిటి?

పచ్చి కూరగాయల్లో తినకూడనివి ఏవి?

మోతాదుకి మించి గ్రీన్ టీ తాగితే...

సిప్లా నుంచి మసాలా జామ రుచితో ప్రోలైట్‌ ఓఆర్ఎస్‌ పోర్ట్‌ఫోలియో

తర్వాతి కథనం
Show comments