ముంబైలో వెలుగు చూసింది ఎక్స్ఈ వేరియంట్ కాదు : కేంద్రం

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2022 (10:45 IST)
మహారాష్ట్రలోని ముంబైలో వెలుగు చూసిన కరోనా వైరస్ ఎక్స్ఈ వేరియంట్ కాదని కేంద్రం స్పష్టం చేసింది. కానీ, ముంబైలో వెలుగు చూసింది ఎక్స్ఈ వేరియంటేనని ముంబై మున్సిపాలిటీ అధికారులు అంటున్నారు. కానీ, కేంద్య శాఖ అధికారులు మాత్రం అందుకున్న భిన్నంగా చెబుతున్నారు. 
 
ఈ యేడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో దేశంలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెద్ద ఎత్తున వెలుగు చూసిన విషయం తెల్సిందే. అయితే, గత రెండు నెలల్లో ఈ కేసు సంఖ్య గణనీయంగా తగ్గిపోయాయి. ఒమిక్రాన్ బీఏ1, బీఏ2 వేరియంట్లు దేశంలో నమోదయ్యాయి. ఈ రెండింటి కలయికే ఎక్స్ఈ వేరియంట్. ఇది ఒమిక్రాన్ వేరియంట్‌తో పోలిస్తే 10 శాతం ఎక్కువ వేగంతో విస్తరించగలదని గుర్తించారు. బ్రిటన్‌లో ప్రస్తుతం అధిక సంఖ్యలో ఈ కేసులు నమోదవుతున్నాయి. 
 
ఇదిలావుంటే, ఇటీవల 50 యేళ్ల వయస్సున్న సౌతాఫ్రికా మహిళ ఇటీవల ముంబైకు వచ్చింది. ఫిబ్రవరి 27వ తేదీన ఆమెకు కరోనా వైరస్ సోకింది. ఆమె నమూనాలను సేకరించి కస్తూర్బా ఆస్పత్రిలోని కేంద్ర పరిశోధనాశాలకు పంపించారు. జీనోమ్ సీక్వెన్సింగ్‌లో ఎక్స్ఈ వేరియంట్‌ను గుర్తించినట్టు మహారాష్ట్ర స్టేట్  సర్వేలెన్స్ ఆఫీసర్ డాక్టర్ ప్రదీఫ్ వెల్లడించారు. అయితే, ఈ వేరియంట్‌ను ఎక్స్ఈగా గుర్తించడం తొందరపాటు చర్యే అవుతుందని కేంద్రం పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments