Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేప్ పార్టీలో ఒక్క ధనవంతుడి బిడ్డపైనా కేసు నమోదు కాలేదు : అసదుద్దీన్ ఓవైసీ

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2022 (10:31 IST)
పోలీసులను దూషించిన కేసులో ఎంఐఎం కార్పొరేటర్‌పై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా హైదరాబాద్ నగర పోలీసులను తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. దీంతో ఎంఐఎం కార్పొరేటర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై హైదారాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. చట్టం ప్రతి ఒక్కరికీ సమానంగా అమలు కావాలన్నారు. 
 
హైదారాబాద్ నగరంలోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌ ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో జరిగిన రేవ్ పార్టీ పట్టుబడిన సినీ ప్రముఖులు, రాజకీయ నేతల పిల్లలందరినీ వదిలివేశారు. ఏ ఒక్కరిపై కేసు నమోదు కాలేదని గుర్తుచేశారు. 
 
రేవ్ పార్టీలో కొకైన్ దొరికిందన్నారు. ఇక్కడ పట్టుబడిన ధనవంతుల పిల్లలందరూ విడుదలయ్యారు. చట్టం అందరికీ సమానంగా ఉండాలని గుర్తుచేశారు. 
 
"ఆర్టికల్ 13 ప్రకారం రూల్ ఆఫ్ లా అత్యున్నతమైనది. అందరికీ సమానమైనది. ఈ "రేవ్ పార్టీ"లో కొకైన్ కనుగొనబడటం చాలా దురదృష్టకరం. పైగా ధనవంతుల పిల్లలందరినీ విడుదల చేయడం చాలా మరీ దురదృష్టకరం అంటూ ట్వీట్ చేశారు. 
 
రూల్ ఆఫ్ లా పేద, ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ సమానంగా అమలు చేయాలంటూ హైదరాదాద్ నగర పోలీసులు, మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ అసదుద్దీన్ ట్వీట్ చేశారు. ఇది ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments