Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించుకున్నారనీ.. నూలుపోగు లేకుండా ఊరేగించారు... ఎక్కడ?

రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఇద్దరు మేజర్లు ప్రేమించుకున్న నేరానికి శరీరంపై నూలు పోగు లేకుండా చేసి గ్రామంలో ఊరేగించారు. పైగా, ఈ ఊరేగింపును కొందరు యువకులు మొబైల్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో

Webdunia
శనివారం, 7 జులై 2018 (17:08 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఇద్దరు మేజర్లు ప్రేమించుకున్న నేరానికి శరీరంపై నూలు పోగు లేకుండా చేసి గ్రామంలో ఊరేగించారు. పైగా, ఈ ఊరేగింపును కొందరు యువకులు మొబైల్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఊరేగింపు వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదైపూర్‌లో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఉదయ్‌పూర్ పరిధిలోని సెర్ గ్రామానికి గిరిజన తెగకు చెందిన యువకుడు సమీప గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు. ఆ తర్వాత పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు. దీన్ని జీర్ణించుకోలేని గ్రామస్తులు వారిద్దరికీ శిక్ష విధించారు. ఇద్దరినీ పట్టుకుని లోదుస్తులు తొలగించి తాళ్లతో కట్టేశారు. అనంతరం గ్రామంలో ఊరేగించారు. 
 
జనాలు వారిని వీడియో తీస్తూ వినోదం చూశారు తప్పితే ఒక్కరంటే ఒక్కరు కూడా అడ్డుకునేందుకు ముందుకు రాకపోవడం విస్మయపరుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని ప్రేమ జంటను విడిపించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments