Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దాతీ మహారాజ్ ఆశ్రమంలో 600 మంది అమ్మాయిలు ఏమయ్యారు?

రాజస్థాన్‌లోని అల్వాస్‌లో దాతీ మహారాజ్ ఆశ్రమం ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. వివాదాస్పద గురువు దాతీ మహారాజ్ నుంచి సుమారు 600 మంది అమ్మాయిలు అదృశ్యమైనట్లు పోలీసులు భావిస్తున్నారు. దాతీ మహారాజ్ తాను దైవ

దాతీ మహారాజ్ ఆశ్రమంలో 600 మంది అమ్మాయిలు ఏమయ్యారు?
, ఆదివారం, 17 జూన్ 2018 (13:40 IST)
రాజస్థాన్‌లోని అల్వాస్‌లో దాతీ మహారాజ్ ఆశ్రమం ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. వివాదాస్పద గురువు దాతీ మహారాజ్ నుంచి సుమారు 600 మంది అమ్మాయిలు అదృశ్యమైనట్లు పోలీసులు భావిస్తున్నారు. దాతీ మహారాజ్ తాను దైవాంశ సంభూతడని చెప్పుకునేవాడు. అలాగే తన ఆశ్రమంలో 700 మంది అమ్మాయిలు ఉన్నారని, వారి ఆలనా పాలనా తానే చూసుకుంటున్నానని పలుమార్లు చెప్పుకునేవాడు. 
 
ఈ నేపథ్యంలో తనపై అత్యాచారం చేశాడని 25 సంవత్సరాల యువతి చేసిన ఫిర్యాదుపై విచారించేందుకు ఆశ్రమానికి వెళ్లిన పోలీసులకు అక్కడ 100 మంది అమ్మాయిలు మాత్రమే కనిపించినట్లు సమాచారం. మిగిలిన అమ్మాయిల సంగతి ఏమైందని పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇంకా ఆశ్రమం నుంచి తప్పించుకున్న దాతీ మహారాజ్‌ను వెతుకుతున్నామని పోలీసు అధికారి తెలిపారు. 
 
దాతీ మహారాజ్ తనను దశాబ్ధం పాటు ఆశ్రమంలో బందీ వుంచాడని.. ఆయన, ఆయన అనుచరులు తనను రేప్ చేశారని బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించింది. ఈ ఘటనపై పోలీసులు విచారణను ముమ్మరం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నగరిలో రోజాకే మళ్లీ పట్టం.. తేల్చేసిన లగడపాటి ఆర్జీ ఫ్లాష్ టీమ్