Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజలకు మాస్కులు స్వయంగా తొడిగిన ముఖ్యమంత్రి!

Webdunia
బుధవారం, 5 జనవరి 2022 (07:12 IST)
దేశంలో కరోనా వైరస్‌తో పాటు ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి భయపెడుతోంది. ముఖ్యంగా కరోనా వైరస్ శరవేగంగా వ్యాపించించనుందంటూ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, కరోనా టీకాలు వేయించుకోవాలని, చేతులకు శానిటైజేషన్ చేసుకుంటూ, భౌతికదూరం పాటిస్తూ ముందుకు సాగాలని ప్రభుత్వాలు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నాయి. కానీ, ప్రజలు మాత్రం ఏమాత్రం లెక్క చేయడం లేదు. 
 
ఇష్టానుసారంగా రోడ్లపై తిరుగుతూ ఈ వైరస్ వ్యాప్తికి ప్రధాన కారకులుగా మారారు. ఈ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ మరోమారు తన ప్రత్యేకతను చాటుకున్నారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించిన రోడ్లపై మాస్కులు లేకుండా తిరుగుతున్న జనాన్ని చూసి తన కాన్వాయ్‌ ఆపి మాస్కులు పంచిపెట్టారు. కొందరికి ఆయనే స్వయంగా మాస్కులు తొడిగారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. 
 
సచివాలయం నుంచి తన క్యాంపు కార్యాలయానికి వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అలాగే, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, కరోనా టీకాలు వేయించుకోవాలని, చేతులకు అపుడపుడూ శానిటైజ్ చేసుకుంటూ, భౌతికదూరం పాటించాలని ఆయన ఈ సందర్భంగా ట్వీట్ ద్వారా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాగేశ్వరరావు గారి ఫ్యాన్స్ తో కలిసి భోజనాలు, బట్టలు పంపిణీ చేసిన అక్కినేని కుటుంబం

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

యూఎస్ పోలో ఆసన్‌తో కలిసి శ్రీ సవాయి పద్మనాభ్ సింగ్ కలెక్షన్

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

తర్వాతి కథనం
Show comments