Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజలకు మాస్కులు స్వయంగా తొడిగిన ముఖ్యమంత్రి!

Webdunia
బుధవారం, 5 జనవరి 2022 (07:12 IST)
దేశంలో కరోనా వైరస్‌తో పాటు ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి భయపెడుతోంది. ముఖ్యంగా కరోనా వైరస్ శరవేగంగా వ్యాపించించనుందంటూ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, కరోనా టీకాలు వేయించుకోవాలని, చేతులకు శానిటైజేషన్ చేసుకుంటూ, భౌతికదూరం పాటిస్తూ ముందుకు సాగాలని ప్రభుత్వాలు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నాయి. కానీ, ప్రజలు మాత్రం ఏమాత్రం లెక్క చేయడం లేదు. 
 
ఇష్టానుసారంగా రోడ్లపై తిరుగుతూ ఈ వైరస్ వ్యాప్తికి ప్రధాన కారకులుగా మారారు. ఈ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ మరోమారు తన ప్రత్యేకతను చాటుకున్నారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించిన రోడ్లపై మాస్కులు లేకుండా తిరుగుతున్న జనాన్ని చూసి తన కాన్వాయ్‌ ఆపి మాస్కులు పంచిపెట్టారు. కొందరికి ఆయనే స్వయంగా మాస్కులు తొడిగారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. 
 
సచివాలయం నుంచి తన క్యాంపు కార్యాలయానికి వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అలాగే, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, కరోనా టీకాలు వేయించుకోవాలని, చేతులకు అపుడపుడూ శానిటైజ్ చేసుకుంటూ, భౌతికదూరం పాటించాలని ఆయన ఈ సందర్భంగా ట్వీట్ ద్వారా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments