Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పది లక్షల మాస్కులను ప్రభుత్వానికి ఇచ్చిన కియా ఇండియా

పది లక్షల మాస్కులను ప్రభుత్వానికి ఇచ్చిన కియా ఇండియా
, మంగళవారం, 6 జులై 2021 (14:28 IST)
కియా ఇండియా పది లక్షల మాస్క్‌లను రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. దీనికి సంబంధించిన పత్రాన్ని, శ్యాంపిల్‌ మాస్క్‌లను సోమవారం ఏపీ విపత్తుల శాఖ కార్యాలయంలో కమిషనర్‌ కె.కన్నబాబుకు కియా ఇండియా సీఈవో కబ్‌ డాంగ్‌ లీ అందించారు. 
 
ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కార్పొరేట్‌ సామాజిక బాధ్యతగా మాస్క్‌లను అందించడం అభినందనీయమన్నారు. ఈ మాస్క్‌లను అన్ని జిల్లాలకు పంపించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కియా ఇండియా లీగల్‌ కార్పొరేట్‌ హెడ్‌ జూడ్‌ లీ, ముఖ్య సలహాదారు డాక్టర్‌ సోమశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మో! ఆక‌తాయిలంటూ దిశ ఫోన్ కాల్ తీరా వెళ్తే...?