భారత్‌లో మూడో కరోనా కేసు.. చైనాలో ఒక్క రోజే 57 మంది మృత్యువాత

Webdunia
సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (13:24 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా భారత్‌లో మూడో కేసు నమోదైంది. కరోనా వైరస్‌కు కేంద్రంగా ఉన్న వుహాన్ నగరం నుంచి కేరళకు వచ్చిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆ రోగిని ఐసోలేటెడ్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ కేసుతో భారత్‌లో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య మూడుకు చేరింది. అలాగే, చైనాలో పర్యటించవద్దని దేశ పౌరులకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పైగా, చైనా నుంచే భారత్‌కు వచ్చే ప్రతి ఒక్కరినీ నిశితంగా పరిశీలించాలని ఆదేశాలు జారీచేసింది. 
 
మరోవైపు, ఈ వైరస్ నివారణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ అవి ఫలించడం లేదు. ఫలితంగా చైనీయుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఆదివారం ఒక్కరోజే ఏకంగా 57 మంది చనిపోవడం షాకిచ్చింది. ఇది చాలదన్నట్లు ఒకేరోజు కొత్తగా 2,829 మంది వ్యాధి బారినపడినట్టు తేలడం వీరిలో 186 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు ధృవీకరించారు. దీంతో కరోనా వైరస్ కారణంగా చైనాలో మరణ మృదంగం ఎక్కడికి చేరుతుందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
 
కాగా, బాధితుల సంఖ్య ఇప్పటివరకు 17,205కి చేరింది. మరో 1,89,583 మంది అనుమానితులు ఉన్నారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని చైనా నిర్మించిన వెయ్యి పడకల ఆసుపత్రి ఈరోజు నుంచి అందుబాటులోకి వస్తోంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: దీవాన మూవీ లో ప్రేమ సాంగ్ రిలీజ్ చేసిన సమంత

Venky: సూర్య తోపాటు అందరినీ మాయ చేసి వైల్ యానిమల్ తో వెంకీ అట్లూరి షూట్

Rowdy Janardhana: రౌడీ జనార్దన షూట్ లో ఆసక్తికర అంశాన్ని వెల్లడించిన రవి కిరణ్ కోల

Mrunal Thakur :అడివి శేష్ డెకాయిట్‌ లోని సెకండ్ సింగిల్ చిచ్చుబుడ్డి రాబోతోంది

'బాక్సాఫీస్ కా బాప్' ఆదిత్య ధర్ : 'ధురంధర్‌' మూవీపై రజనీకాంత్ ప్రశంసలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుచ్చకాయ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఆనందం, ఆదరణ, నివారణ సంరక్షణతో వృద్ధాప్యాన్ని పునర్నిర్వచించాలని జాతీయ పిలుపు

మార్కెట్లోకి నకిలీ కోడిగుడ్లు, గుర్తించడం ఎలా?

డానోన్ ఇండియా రక్తహీనతపై పోరాటానికి సహాయం చేస్తామని ప్రతిజ్ఞ

టైప్ 2 మధుమేహుల కోసం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ ఒబెడా విడుదల

తర్వాతి కథనం
Show comments