Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిడ్డ పుట్టింది, కానీ రాయిలా మారుతోంది, తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు

Webdunia
శనివారం, 3 జులై 2021 (18:53 IST)
కన్నబిడ్డను కళ్లారా చూడగానే తల్లిదండ్రులు పొంగిపోతారు. ఈ ఏడాది జనవరి 31న పుట్టిన చిన్నారిని చూడగానే ఆ తల్లిదండ్రులు కూడా సంబరాలు చేసుకున్నారు. కానీ 5 నెలలు గడిచాక పాపలో ఏదో తేడా వస్తున్నట్లు గమనించారు. వెంటనే ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. పరీక్షించిన వైద్యులు ఆ పాపకు అరుదైన వ్యాధి సోకిందనీ, ఈ కారణంగా ఆమె క్రమంగా రాయిలా మారుతుందని షాకింగ్ వార్త చెప్పారు. దాంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు.
 
వివరాల్లోకి వెళితే... యూకెలోని హేమెల్ హెంప్‌స్టెడ్ ప్రాంతంలో అలెక్స్, దవే దంపతులు వుంటున్నారు. వీరికి గత జనవరిలో పాప పుట్టింది. ఈ బేబీకి 5 నెలల తర్వాత కాలిబొటనవేళ్లు రెండు అతుక్కున్నట్లు అగుపించాయి. వెంటనే ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా పాపకు ఎఫ్ఓపి అనే అరుదైన వ్యాధి సోకినట్లు తెలిపారు వైద్యులు.
 
ఈ జబ్బు 20 లక్షల మందిలో ఒకరికి వస్తుందన్నారు. ఈ జబ్బు కారణంగా శరీరంలో ఎముకలు పెరుగుతూ పోతుంటాయి. ఫలితంగా కొన్నాళ్లకి పాప కదల్లేని పరిస్థితి ఏర్పడుతుంది. వీరి జీవితకాలం 40 ఏళ్లకు మించదు. 20 ఏళ్లపాటు మంచానికే పరిమితం కావాల్సి వుంటుంది. ఈ వార్త విన్న తల్లిదండ్రులు అధైర్యపడలేదు. తమ చిన్నారికి చికిత్స చేయించి ఎలాగైనా మామూలు స్థితిలో వుంచాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments