Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ప్రభుత్వం రూ. 17 లక్షలు ధారపోసినా క‌త్తి మ‌హేష్ క‌న్నుమూత‌

Webdunia
శనివారం, 10 జులై 2021 (23:23 IST)
న‌టుడు. ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ కన్ను మూశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కత్తి మహేష్ మృతి చెందారు. గ‌త కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్న మ‌హేష్ ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని, ఆయ‌న బ‌తికి బ‌య‌టికి వ‌స్తార‌ని చాలా మంది అనుకున్నారు.

కానీ, ఆయ‌న ఆరోగ్యం ఆసుప‌త్రిలోనే విష‌మించి మ‌ర‌ణించారు. నెల్లూరు జిల్లాలో జరిగిన  రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన కత్తి మహేష్ మృతిపై ప‌లువురు ధిగ్భాంతిని వ్య‌క్తం చేస్తున్నారు. జూన్ 26 న తెల్లవారుఝూమున ఆయన ప్రయాణిస్తున్న వాహనం నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జాతీయ రహదారిపై ప్ర‌మాదానికి గుర‌యింది.

ముందు వెళ్తున్న లారీని వేగంగా ఢీ కొట్టింది. దీంతో మహేశ్‌ వాహనం ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ఎయిర్‌ బ్యాగ్స్‌ తెరుచుకున్నా, తల భాగంలో మహేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆయన్ని నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం  చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు.  కత్తి మహేష్ కు మెరుగైన వైద్యం అందించేందుకు ఏపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధినుంచి రూ. 17లక్షల రూపాయలు అందచేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

Mutton: మటన్ రోజుకు ఎంత తినాలి.. ఎవరు తీసుకోకూడదో తెలుసా?

Garlic fried in ghee- నేతితో వేయించిన వెల్లుల్లిని తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments