Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు అడ్డా కుప్పం గడ్డా అడ్డం తిరిగిందే: లోకేష్ ఆ పని చేస్తానంటున్నారా?

Webdunia
బుధవారం, 17 నవంబరు 2021 (19:58 IST)
ఎపిలో అన్ని మున్సిపాలిటీల ఫలితాలు ఒక ఎత్తయితే కుప్పం మున్సిపాలిటీ గెలుపు మరొక ఎత్తు. అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు గెలుపు కోసం రకరకాల ప్రయత్నాలు చేశారు. 

 
కుప్పం కంచుకోటలో టిడిపి జెండాను ఎగురవేస్తామని ఆ పార్టీ అభ్యర్థులు చెబితే కాదు వైసిపి జెండా ఎగురుతుందని చెప్పారు. చివరకు ఫలితాల్లో వైసిపికే అనుకూలంగా వచ్చాయి.

 
వైసిపికి 19, టిడిపికి ఆరు స్థానాలు వచ్చాయి. అయితే ఎన్నికలకు ముందు ప్రచారం నిర్వహించారు చంద్రబాబు, నారా లోకేష్. లోకేష్ పర్యటనలో మాత్రం చంద్రబాబు అడ్డా కుప్పం గడ్డా అంటూ భారీ డైలాగులు చెప్పారు. ఇది కాస్త పెద్ద చర్చకు దారి తీసింది.

 
లోకేష్ పర్యటన తరువాత టిడిపి నేతల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. ప్రజలందరూ టిడిపి వైపే ఉన్నారని అందరూ భావించారు. కానీ అంతా రివర్స్ అయ్యింది. కుప్పంలో ఘోర పరాజయం ఎదురైంది.

 
దీంతో ఓటమిని చాలా సీరియస్‌గా తీసుకున్నారట లోకేష్. టిడిపి జాతీయ ప్రదాన కార్యదర్శి పదవికి రాజీనామా చేయాలని అనుకుంటున్నారట. నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేయడమే మంచిదన్న నిర్ణయంలో ఉన్నారట లోకేష్. 

 
అయితే పార్టీ సీనియర్ నేతలు మాత్రం అది సరైంది కాదంటున్నారట. ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజమేనని.. దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారట. దీంతో లోకేష్ కూడా ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

భారతదేశంలో అవకాడో న్యూట్రిషనల్- ఆరోగ్య ప్రయోజనాలు తెలియచెప్పేందుకు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్

బ్యాక్ పెయిన్ సమస్యను వదిలించుకునే మార్గాలు ఇవే

తర్వాతి కథనం
Show comments