తమిళనాడులో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు.. కాంటాక్ట్ అయిన మరో ఏడుగురికి...

Webdunia
బుధవారం, 15 డిశెంబరు 2021 (22:16 IST)
తమిళనాడు రాష్ట్రంలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. నైజీరియా నుంచి చెన్నైకు వచ్చిన వ్యక్తికి ఈ వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఎం. సుబ్రహ్మణ్యం బుధవారం రాత్రి ప్రకటించారు. అలాగే, ఆయన్ను కాంటాక్ట్ అయిన్ మరో ఏడుగురికి కూడా ఈ వైరస్ సోకివుండొచ్చన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. 
 
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. మన దేశంలో తొలి ఒమిక్రాన్ కేసు బెంగుళూరులో వెలుగు చూసింది. ఆ తర్వాత మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో వెలుగు చూశాయి. బుధవారం వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోనూ ఈ వైరస్ వెలుగు చూసింది. హైదరాబాద్ నుంచి బెంగాల్‌కు వెళ్లిన ఏడేళ్ళ బాలుడికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. 
 
ఈ నేపథ్యంలో తమిళనాడులో ఒమిక్రాన్ కేసు నమోదైంది. నైజీరియా నుంచి చెన్నైకు వచ్చిన ఓ రాష్ట్ర పౌరుడికి ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిందని మంత్రి సుబ్రహ్మణ్యం తెలిపారు. అలాగే, ఆయన్ను కాంటాక్ట్ అయిన మరో ఏడుగురికి కూడా ఈ వైరస్ సోకివుంటన్న అనుమానం కలుగుతుందన్నారు. వారి శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపినట్టు ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments