Webdunia - Bharat's app for daily news and videos

Install App

29 ఏళ్లకే సీఎం పదవిని చేపట్టనున్న శివసేన 'యంగ్ టైగర్' ఆదిత్య ఠాక్రే

Webdunia
శుక్రవారం, 25 అక్టోబరు 2019 (11:43 IST)
మహారాష్ట్రకు శివసేన నుంచి అతి పిన్నవయసులోనే యంగ్ టైగర్ ఆదిత్య ఠాక్రే సీఎం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. దీనికి కారణం బీజేపీ హవా తగ్గడమే. గత ఎన్నికలతో పోల్చుకుంటే బీజేపీ కాస్త వెనక్కి తగ్గిందనే చెప్పాలి. 2014లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 122 స్థానాలు సాధించిన బీజేపీ ఈసారి 105 స్థానాలకే పరిమితమైంది. శివసేన తాజా ఎన్నికల్లో 56 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో శివసేన శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో బీజేపీపై ఒత్తిడి పెంచేందుకు శివసేన ప్రయత్నాలు చేస్తోంది.
 
సీఎం పదవీ కాలాన్ని చెరిసగం పంచుకోవాలని బీజేపీకి శివసేన ప్రతిపాదన పంపినట్లు తెలుస్తోంది. తొలి అవకాశం తమకే ఇవ్వాలని కూడా శివసేన కోరినట్లు తెలిసింది. ఆదిత్య ఠాక్రేను సీఎం చేయాలని శివసేన నేతలు డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 
మరోవైపు శివసేన పార్టీ స్థాపించిన నాటి నుంచి ఠాక్రే కుటుంబం ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. ఈసారి బాల్ ఠాక్రే మనవడు ఆదిత్య ఠాక్రే 70 వేల బంపర్ మెజారిటీతో విజయం సాధించారు. ఇంకోవైపు భాజపాకు స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఇక శివసేన దిక్కయ్యింది. ఈ నేపధ్యంలో 50-50 లెక్క ప్రకారం రెండున్నరేళ్లు శివసేన- మరో రెండున్నరేళ్లు భాజపా అధికారాన్ని పంచుకుంటాయన్న ప్రచారం జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments