Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో గుండు చేసిన దృశ్యం, నూతన్ నాయుడు భార్యపై బిగుస్తున్న ఉచ్చు?

Webdunia
శనివారం, 29 ఆగస్టు 2020 (16:17 IST)
దళితుడిని ఇంటికి పిలిపించి శిరోముండనం(గుండు) చేసిన ఘటనలో నూతన్ నాయుడు భార్య మధుప్రియు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇంట్లోని సిసి టివి ఫుటేజ్‌ను పోలీసులు విడుదల చేశారు. అందులో పనివాళ్ళతో పాటు నూతన్ నాయుడు భార్య దగ్గరుండి మరీ శిరోముండనం చేయిస్తున్న విజువల్స్ బయటడ్డాయి. 
 
ఈ విషయాన్ని విశాఖ పోలీసు కమిషనర్ మీష్ కుమార్ సిన్హా వెల్లడించారు. ఈ కేసులో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పెందుర్తి పోలీసులు. సెక్షన్ 307, 342, 324, 323, 506r/w34ipc 3(1)b ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
 
ఎ వన్ ముద్దాయిగా నూతన్ నాయుడు భార్య మధుప్రియతో పాటు ఇంట్లో సహాయకులుగా ఉన్న వరహాలు, ఇందిర, జాన్సీ, సౌజన్య, బాలు, రవిలపై కేసులు నమోదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా శ్రీకాంత్ కేసు పెద్ద చర్చ జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ఈ కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments