Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈఎస్ఐ స్కామ్ : అచ్చెన్నాయుడికి బెయిల్

ఈఎస్ఐ స్కామ్ : అచ్చెన్నాయుడికి బెయిల్
, శుక్రవారం, 28 ఆగస్టు 2020 (14:21 IST)
తెలుగు రాష్ట్రాలను ఓ కుదుపుకుదిపిన ఈఎస్ఐ స్కామ్‌లో అరెస్టు అయిన టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే, మాజీ మంత్రి కె.అచ్చెన్నాయుడికి బెయిల్ మంజూరైంది. ఈ మేరకు ఏపీ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. 
 
ఈఎస్ఐ స్కామ్‌లో అరెస్టు అయిన అచ్చెన్నాయుడికి కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయన ప్రస్తుతం మంగళగిరిలోని ఎన్నారై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని గతంలో కోర్టుకు దరఖాస్తు చేయగా న్యాయస్థానం తిరస్కరించింది. 
 
మరోసారి బెయిల్ మంజూరు చేయాలని అచ్చెన్న తరపు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థి లోద్ర, హైకోర్టు సీనియర్ న్యాయవాది వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. 
 
ఈ వాదనలు మూడు రోజుల క్రితమే పూర్తయ్యాయి. కానీ తీర్పును రిజర్వులో ఉంచి శుక్రవారం వెలువరించింది. కొద్ది సేపటి క్రితమే హైకోర్టు అచ్చెన్నాయుడుకి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. 
 
రూ.2 లక్షలు షూరిటీ ఇవ్వాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం దాటి వెళ్లవద్దని, సాక్షులను తారుమారు చేయవద్దని, దర్యాప్తు అధికారికి అందుబాటులో ఉండాలని హైకోర్టు విధించిన షరతుల్లో పేర్కొంది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈఎస్ఐ స్కాం.. అచ్చెన్నాయుడికి బెయిల్ మంజూరు