Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాకంత సీన్ లేదు... అసత్యాలు ప్రచారం చేయొద్దు ప్లీజ్.. నటుడు కృష్ణుడు

నాకంత సీన్ లేదు... అసత్యాలు ప్రచారం చేయొద్దు ప్లీజ్.. నటుడు కృష్ణుడు
, శుక్రవారం, 28 ఆగస్టు 2020 (18:35 IST)
హైదరాబాద్ నగరానికి చెందిన ఓ యువతి తనపై 139 మంది అత్యాచారం చేశారనీ, వారిలో బడా రాజకీయ నేతలతో పాటు సినీ సెలెబ్రిటీలు కూడా ఉన్నారంటూ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఈ విచారణలో భాగంగా, ఆ యువతి అనేక సినీ ప్రముఖుల పేర్లను వెల్లడించింది. ఇలాంటి వారిలో బుల్లితెర యాంకర్ ప్రదీప్‌ పేరు తొలుత బయటకు వచ్చింది. ఇపుడు మరో నటుడు కృష్ణుడు పేరు వచ్చింది. 
 
దీనిపై నటుడు కృష్ణుడు స్పందించాడు. ఇది పూర్తిగా నిరాధారమైన కేసుగా తాను భావిస్తానని చెప్పాడు. హైదరాబాద్ నగరంలో పటిష్టమైన పోలీస్ వ్యవస్థతో పాటు నిరంతరం అందుబాటులో ఉండే షిటీమ్స్ వ్యవస్థ అందుబాటులో ఉందనీ, చదువుకున్న యువతి తనకు అన్యాయం జరుగుతుంటే అప్పుడు ఎందుకు ఫిర్యాదు చేయలేదు కృష్ణడు ప్రశ్నించాడు. 
 
నిజంగా తనకు అన్యాయం జరిగి ఉంటే డయల్ 100కు ఫోన్ చేసుంటే పోలీసులు తక్షణమే స్పందించి ఉండేవాళ్లు. మమ్మలి కలవడానికి చాలా మంది వస్తుంటారు. సెలబ్రటీలను కేసులో ఇన్వాల్‌ చేయడంతో కేసు తీవ్రత పెరుగుతుందంటే తప్పు. ఈ కేసులో నిజానిజాలను పోలీసులు వెలికితీస్తారు అని కృష్ణుడు చెప్పారు.
 
ముఖ్యంగా, ఇలాంటి ఆరోపణలతో మేము, మా కుటుంబసభ్యులు మానసికంగా ఇబ్బందులు పడుతున్నామని చెప్పుకొచ్చాడు. నాలుగైదు నెలల క్రితం నల్గొండ జిల్లా నుంచి ఓ మహిళ నాకు ఫోన్ చేసింది. నీను మీ అభిమానిని, నల్గొండకు రావాలని ఫోన్‌లో చేప్పింది. అయితే నాకు అనుమానం వచ్చి కాల్‌కట్ చేసి నెంబర్‌ను బ్లాక్ చేశాను. ఈ కేసులో పోలీసుల నుంచి ఎలాంటి నోటీసులు కానీ, ఫోన్‌ కానీ నాకు రాలేదు. నేను ఈ కేసు విచారణకు పూర్తిగా సహకరిస్తాను అంటూ కృష్ణుడు చెప్పుకొచ్చాడు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్తకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.. చిట్టితల్లి ఫోటోలు షేర్ చేసిన స్నేహ