Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజాకు సజ్జల ఫోన్, ఇక ఆ పదవి రావడమే ఆలస్యమా?

Webdunia
శుక్రవారం, 13 ఆగస్టు 2021 (18:06 IST)
ఉన్న ఎపిఐఐసి ఛైర్ పర్సన్ పదవి పోయింది. మంత్రి పదవి అస్సలు రాదు. ఇప్పట్లో నామినేటెడ్ పదవి ఉండబోదు. కేవలం ఎమ్మెల్యేగానే ఆమె ఉండాలి. ప్రారంభోత్సవాలు చేసుకోవాలి. హడావిడి చేయాలే తప్ప ఉపయోగమేమీ ఉండదని రోజా వ్యతిరేకుల బాగా ప్రచారం చేస్తున్నారు.
 
తాజాగా ఎపి సిఎం ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల్లో రోజాకి ఉన్న పదవి కాస్త పోయింది. దీంతో ఆమెకు మంత్రి పదవి వస్తుందని... ఆమె సన్నిహితులు భావిస్తే, ఇక రోజా పనైపోయిందని వ్యతిరేకులు ప్రచారం ప్రారంభించారు. కానీ రోజా మాత్రం ఎలాంటి విమర్సలకు, ఆరోపణలు, జరుగుతున్న ప్రచారంపై స్పందించలేదు. 
 
తన సొంత నియోజకవర్గం నగరి, పుత్తూరు నియోజకవర్గాల్లో బిజీబిజీగా పర్యటిస్తూ అభివృద్థి కార్యక్రమాలకు భూమి పూజ, శంఖుస్థాపనలు చేస్తూ.. పూర్తయిన వాటిని ప్రారంభిస్తూ ముందుకు సాగుతోంది. తన నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటోంది రోజా. 
 
తాజాగా రోజాకు స్వయంగా సజ్జల రామక్రిష్ణారెడ్డికి ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. మంత్రి పదవి రేసులో మీరున్నారని ఆమె దృష్టికి తీసుకెళ్ళారట. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామక్రిష్ణారెడ్డి వైసిపి ప్రభుత్వంలో కీలక పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రోజాకు సజ్జల ఫోన్ చేయడంతో ఆమె అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారట. ఇక ఎవరెన్ని మాట్లాడుకున్నా రోజాకు మంత్రి పదవి ఖాయమని చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments