శబరిమలపై మహిళల ప్రవేశం.. సుప్రీం తీర్పుపై రివ్యూ వేయనున్న కాంగ్రెస్

శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాల పర్వం కొనసాగుతోంది. తాజాగా సుప్రీం కోర్టు తీర్పుపై.. కాంగ్రెస్ రివ్యూ పిటిషన్ వేయాలనే యోచనలో వున్నట్

Webdunia
గురువారం, 4 అక్టోబరు 2018 (16:13 IST)
శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాల పర్వం కొనసాగుతోంది. తాజాగా సుప్రీం కోర్టు తీర్పుపై.. కాంగ్రెస్ రివ్యూ పిటిషన్ వేయాలనే యోచనలో వున్నట్లు తెలుస్తోంది. 
 
మహిళల ప్రవేశంపై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా పిటిషన్‌ వేసే యోచనేదీ లేదని కేరళ ప్రభుత్వం తెగేసి చెప్పింది. ఆలయ వ్యవహారాలు చూసుకునే ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు (టీడీబీ) కూడా సుప్రీంకోర్టు తీర్పు పునః పరిశీలన కోరే అంశంపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు.
 
అంతేగాకుండా.. శబరిమలలో మహిళలకు స్నానాల కోసం ప్రత్యేక ఘాట్లు, బస్సుల్లో ప్రత్యేక సీట్ల కేటాయింపు, రాత్రి పూట భద్రత కోసం లైట్ల సంఖ్యను పెంచడం, మహిళలకు ప్రత్యేకంగా టాయిలెట్ల ఏర్పాటు వంటి సదుపాయాలను కల్పించే యోచనలో కేరళ ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పుపై రాష్ట్ర కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రమేశ్‌ చెన్నితాల శుక్రవారం నిరాహార దీక్ష చేయనున్నారు. 
 
ఈ మేరకు దీనిపై ట్రావెన్‌కోర్ మాజీలతో సమావేశం జరుగనుంది. ట్రావెన్‌కోర్‌ దేవస్థానం‌ బోర్డు‌(టీడీబీ) అధ్యక్షులు, మాజీ సభ్యులు, గురువాయూరు, కొచ్చి దేవస్థానం బోర్డు సభ్యులందరూ ఈ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో రివ్యూ పిటిషన్‌కు సంబంధించి తుది నిర్ణయం వీరే తీసుకుంటారు.
 
కేపీసీసీ అధ్యక్షుడైన ముల్లప్పల్లి రామచంద్రన్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అయిన రమేశ్‌ కూడా పాల్గొననున్నారు. సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్‌, మహిళలు ఆలయంలోకి ప్రవేశిస్తే భవిష్యత్తులో సంభవించే పరిణామాలు, రమేశ్‌ నిరాహార దీక్షకు మద్దతు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments