పొత్తు పెట్టుకుంటే నాకు ఫోన్ చేసి చెప్పేవారు, ఇదంతా గేమ్: పవన్ కళ్యాణ్

Webdunia
శనివారం, 15 ఫిబ్రవరి 2020 (19:16 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో భాజపా అగ్రనాయకులతో భేటీల మీద భేటీలు కావడంతో ఏపీ రాజకీయాల్లో హీటెక్కుతోంది. వైసీపీ ఏకంగా వచ్చే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో తమ పార్టీ నుంచి నలుగురికి కేంద్ర మంత్రులు కట్టబెట్టబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. దీనితో ఈ విషయం కాస్తా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లింది.
 
ఈ ప్రచారంపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... "జగన్ రెడ్డి గారు ఎన్డీఏతో పొత్తు పెట్టుకుంటున్నట్లు నాకు సమాచారం ఏమీ లేదు. ఒకవేళ అలాంటిది ఏమయినా వుంటే తనకు భాజపా నుంచి ఫోన్ వచ్చి వుండేది. అలాంటిదేమీ లేదు. ఇదంతా ఏదో గేమ్ తప్ప మరేమీ కాదు. 
 
వాళ్లేదో ప్రచారం చేసుకుంటున్నారు కానీ భాజపా నుంచి తనకు ఎలాంటి సమాచారం లేదు. పొత్తు వున్నదంటూ నమ్మి ప్రధాని మోదీ, అమిత్ షాలను అపార్థం చేసుకోవద్దు. వాళ్ల తరపున నేను చెపుతున్నా." అంటూ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ది తో రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు వస్తుంది : శివరాజ్ కుమార్‌

Vaishnavi : ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ నుండి ప్రియసఖి మెలోడీ గీతం విడుదల

అతని కోసం పెద్ది చిత్రంలో నటించాలని నిర్ణయం తీసుకున్నా : దివ్యేందు శర్మ

M.M. Keeravani: లవ్ స్టోరీలో ఏడు పాటలు ఉంటాయంటే బ్లాక్ బస్టర్ : ఎంఎం కీరవాణి

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

తర్వాతి కథనం
Show comments