Webdunia - Bharat's app for daily news and videos

Install App

#RIPsujith రెండేళ్ల బాలుడు.. బోరు బావిలో నాలుగు రోజులు.. చివరికి మృతి

Webdunia
మంగళవారం, 29 అక్టోబరు 2019 (11:22 IST)
రెండేళ్ల బాలుడు.. బోరు బావిలో.. నాలుగు రోజుల పాటు వుండి.. చివరికి ప్రాణాలు కోల్పోయాడు. తమిళనాడులో ఈ నెల 25న ఇంటి వద్ద ఆడుకుంటూ బోరుబావిలో పడ్డ రెండేళ్ల సుజిత్ విల్సన్ మృతి చెందాడు. నాలుగు రోజుల నుంచి బోరుబావిలో నరకం అనుభవించిన బాలుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని బాలుడి తల్లిదండ్రులు జీర్ణించుకోలేక కన్నీరుమున్నీరవుతున్నారు. 
 
బాలుడి మృతదేహాన్ని మనప్పరాయ్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తమిళనాడు ప్రజలు సుజిత్ కోసం చేసిన ప్రార్థనలన్నీ ఫలితం లేకపోయాయి. ఇక సుజిత్ మృతదేహాన్ని బోరుబావిలో నుంచి వెలికితీయడానికి మూడు రోజులుగా తీవ్ర ప్రయత్నాలు చేశారు. బాలుడిని రక్షించేందుకు ప్రయత్నించిన రెస్క్యూ టీం శాయశక్తులా ప్రయత్నించినా ప్రయత్నం లేకపోయింది.
 
బోరుబావిలో పడ్డ సుజిత్‌ను వెలికితీసే సమయానికి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉంది. దీంతో రెస్క్యూ టీమ్ ఆపరేషన్‌ను నిలిపివేశారు. తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ సంఘటన సంచలనం రేకెత్తించింది. దాదాపు 80 గంటల పాటు ఈ రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. ఇలాంటి ఘటనలు ఎన్ని జరుగుతున్నా బోరు బావి తవ్వకాలు ఆగడం లేదు. తవ్విన బావులు నిరుపయోగం అయితే వాటిని పూడ్చకపోవడం కారణంగా ఇలాంటి దారుణమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ప్రజలు మండిపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments