Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జీవితంపై విరక్తి.. ఆ వృద్ధుడు చితిపై పడుకుని నిప్పంటించుకున్నాడు

జీవితంపై విరక్తి.. ఆ వృద్ధుడు చితిపై పడుకుని నిప్పంటించుకున్నాడు
, గురువారం, 24 అక్టోబరు 2019 (18:38 IST)
వృద్ధుడైపోయాడు. భార్య కూడా కొన్నేళ్ల క్రితమే చనిపోయింది. అన్నీ తానై చూసుకోవాల్సిన కుమారుడు కూడా మరణించాడు. ఇక ఒంటరితనం ఆ వృద్ధుడిని వేధించింది.

అనాథగా మారిపోయిన అతనికి భార్య, కుమారుడి జ్ఞాపకాలే గుర్తుకు వచ్చాయి. దాంతో తనను తాను పోషించుకోలేక.. జీవితంపై విరక్తితో ఆ వృద్ధుడు తనకు తానే చితిని పేర్చుకుని.. దానిపై పడుకుని నిప్పంటించుకున్నాడు. 
 
ఈ ఘటన తమిళనాడు, తిరుప్పూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరుప్పూరుకు చెందిన అజ్జప్ప (85) కుమారుడు సిద్ధప్ప (58) గత ఆరు నెలల క్రితం తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశాడు.
 
కోడలు, మనవళ్లు ఉన్నా.. గొడవల కారణంగా పట్టించుకోలేదు. దాంతో అజ్జప్ప మానసికంగా కృంగిపోయాడు. ఊరు వదలి వెళ్లిపోయి దేవాలయాలు, పాడుబడ్డ భవనాల్లో నివసిస్తూ ఉండేవాడు. ఐతే నాలుగు రోజులుగా అతడు కనిపించడం లేదు. ఈ క్రమంలో గొరవెహళ్ల అటవీ ప్రాంతంలో సగం కాలిన వృద్ధుడి శవాన్ని గుర్తించిన గొర్రెల కాపర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కాలిన మృతదేహం అజ్జప్పదని తేల్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్యకు దెయ్యం: ముగ్గురు మంత్రగాళ్ళు అత్యాచారం, ఆ తర్వాత?