విచారణకు రెడీ.. ట్యాపింగ్​ కేసుపై కుమారస్వామి

Webdunia
సోమవారం, 19 ఆగస్టు 2019 (21:53 IST)
కొద్ది రోజులుగా కర్నాటకను కుదిపేస్తున్న ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో బీజేపీ సర్కార్​ కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ సీఎం కుమారస్వామిని ఇరుకునపెట్టేలా ట్యాపింగ్​ కేసుల దర్యాప్తును కేంద్ర ఏజెన్సీ సీబీఐకి అప్పగించనున్నట్లు సీఎం యడియూరప్ప ఆదివారం ప్రకటించారు. ఈ మేరకు సోమవారమే సీబీఐకి లెటర్​ రాస్తానని చెప్పారు. 
 
కొద్దిరోజుల కిందట రాష్ట్రంలో పొలికల్​ క్రైసిస్​ తలెత్తిన సందర్భంలో నాటి సీఎం కుమారస్వామి.. బీజేపీ, కాంగ్రెస్​కు చెందిన కీలక నేతలు, ఇంకొందరు అధికారుల ఫోన్లు ట్యాప్​ చేయించారనే ఆరోపణలొచ్చాయి. అక్రమంగా ఫోన్లు ట్యాప్​ చేసి, రాజీనామాలు వెనక్కి తీసుకోకుంటే ఆడియో క్లిప్స్​ బయటపెడతానని కుమారస్వామి బెదిరించినట్లు రెబల్​ ఎమ్మెల్యేల్లో ఒకరైన ఏహెచ్​ విశ్వనాథ్​(జేడీఎస్​) ఆరోపించారు. 
 
బెంగళూరు సిటీ పోలీస్​ కమిషనర్​ ఓ అధికారితో మాట్లాడిన ఆడియో క్లిప్​ కూడా సంచలనం రేపింది. ఫోన్​ ట్యాపింగ్స్​పై సీబీఐ ఎంక్వైరీని కాంగ్రెస్​ పార్టీ స్వాగతించింది. అయితే గతంలోలా సీబీఐని బీజేపీ తన సొంతానికి వాడుకోవద్దని, వేరే పార్టీల ఎమ్మెల్యేల్ని బీజేపీలోకి చేర్చుకున్న 'ఆపరేషన్​ కమల్'పైనా విచారణ చేయించాలని కాంగ్రెస్​ లీడర్​ సిద్దరామయ్య కోరారు. 
 
కాగా, ఫోన్​ట్యాపింగ్​ వ్యవహారంతో తనకు సంబంధంలేదని, కొన్ని లోకల్​ టీవీ చానెల్స్​ పనిగట్టుకుని ప్రాపగండా చేశాయని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. 'సీబీఐతో కాకుంటే ఇంటర్నేషనల్​ ఏజెన్సీతోనైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. కావాలనుకుంటే దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కు ఫిర్యాదుచేసి, ఆయన తరఫున ఎవరితోనైనా దర్యాప్తు చేయించినా ఫర్వాలేదు' అని కుమారస్వామి మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగా ఫ్యామిలీకి వారసుడొచ్చాడు.. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నారు : చిరంజీవి

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టారోచ్

ఫంకీ లో రట్టాటటావ్ గీతంలో విశ్వక్ సేన్, కయాదు లోహర్‌ కెమిస్ట్రీ వన్నెతెచ్చింది

NagAswin: నాగ్ అశ్విన్, సింగీతం శ్రీనివాసరావు, దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ చిత్రం షురూ

'జన నాయగన్' నిర్మాతకు తీవ్ర నష్టం జరుగుతోంది : హీరో విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

హైదరాబాదులో PMJ Jewels హాఫ్ శారీస్, పెళ్లి వేడుకల నగల డిజైన్ల ప్రదర్శన

winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?

ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతికత అధునాతన ఇమేజింగ్, హెల్త్‌కేర్ ఐటి పరిష్కారాల ఆవిష్కరణ

హైదరాబాద్‌ ఐఆర్‌ఐఏ 2026లో బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ అధునాతన ఇమేజింగ్, ఏఐ సామర్థ్యాల ప్రదర్శన

తర్వాతి కథనం
Show comments