Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాఫేల్‌పై కేంద్రానికి ఊరట : రాహుల్ వ్యాఖ్యలు దురదృష్టకరం .. సారీ చెప్పారు కదా.. ఒకే : సుప్రీం

Webdunia
గురువారం, 14 నవంబరు 2019 (11:27 IST)
రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారుకు ఊరట లభించింది. ఈ కేసులో విచారణకు అర్హమైన అంశాలేవీ లేవని స్పష్టం చేసింది. అందువల్ల ఈ కేసులో సీబీఐ విచారణ అవసరం లేదని స్పష్టం చేసింది. 
 
అలాగే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన చోకీదార్ చోర్ వ్యాఖ్యలపై కూడా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ తరహా వ్యాఖ్యలు చేయడం, ఈ వ్యాఖ్యలను తమకు కూడా ఆపాదించడం దురదృష్టకరమని ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ సారథ్యంలోని ధర్మాసనం స్పష్టంచ చేసింది. 
 
పైగా, ఈ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ చెప్పిన క్షమాపణలను అంగీకరించిన సుప్రీంకోర్టు మరోమారు ఈ తరహా వ్యాఖ్యలు చేయొద్దంటూ మందలించి వదిలివేసింది. అలాగే, భవిష్యత్‌లో ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దంటూ హితవు పలికింది. 
 
అదేవిధంగా, 36 రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం 2018 డిసెంబరు 14వ తేదీన సంబంధిత పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. 
 
ఈ తీర్పును పునఃపరిశీలించాలని కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీలతో పాటు.. ప్రముఖ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌లు రివ్యూ పిటిషన్లను దాఖలు చేశారు. వీటన్నింటినీ విచారించిన కోర్టు రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో విచారణార్హమైన అంశాలేవీ లేవని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments