Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియాంకా గాంధీ ట్విట్టర్ ఖాతా వైరల్.. నిమిషాల్లో వేల సంఖ్యలో ఫాలోయర్లు...

Webdunia
సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (12:46 IST)
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెల్లి ప్రియాంకా గాంధీ వాద్రా తొలిసారి ట్విట్టర్ ఖాతాను తెరిచారు. ఈ ఖాతా ప్రారంభించిన కొన్ని నిమిషాల్లోనే ఆమె ఫాలోయర్ల సంఖ్య వేలల్లో చేరిపోయింది. ఈ ఖాతాను ఆదివారం రాత్రి 10.45 గంటల సమయంలో ఆమె ప్రారంభించగా, ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా వెల్లడించింది. ఆ తర్వాత కొన్ని నిమిషాల వ్యవధిలోనే వెరిఫైడ్ అకౌంట్‌గా ట్విట్టర్ గుర్తించడం విశేషం. 
 
ఆమెకు ట్విట్టర్‌లో రాత్రి నుంచి ఉదయం వరకు 15 వేల మంది ఫాలోవర్లు వచ్చేశారు. ఇప్పటివరకైతే ఆమె ఎలాంటి ట్వీట్ చేయలేదు. అటు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రియాంకా ట్విట్టర్‌లో అడుగుపెట్టిన విషయాన్ని వెల్లడించింది. కాంగ్రెస్ మద్దతుదారులు ఆమెను ట్విట్టర్‌లో ఫాలో కావచ్చని ట్వీట్ చేసింది. 
 
సోషల్ మీడియా వాడకం పెరిగిపోతున్న సమయంలో కొత్తగా పలువురు ప్రముఖ నేతలు ట్విట్టర్ ఖాతాలను తెరుస్తున్నారు. గత నెలలోనే బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ట్విట్టర్‌లో అడుగుపెట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

తర్వాతి కథనం
Show comments