Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ దేశంలో ఆంధ్రా భాగం కాదా? చౌకీదార్ కాస్త చోర్ అయ్యాడు : రాహుల్ ధ్వజం

Webdunia
సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (12:08 IST)
ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోమారు విమర్శల వర్షం కురిపించారు. చౌకీదార్ కాస్త చోర్ అయ్యారంటూ మండిపడ్డారు. ఏపీకి కేంద్రం చేసిన అన్యాయానికి నిరసనగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ధర్మాపోరాట దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు రాహుల్ గాంధీతో పాటు పలువురు సీనియర్ నేతల తమ సంఘీభావాన్ని ప్రకటించారు. 
 
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ విశ్వసనీయత కోల్పోయారన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేరుస్తారో లేదో చెప్పాలని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఏపీ ఈ దేశంలో భాగం కాదా అని నిలదీశారు. గత ప్రధాని ఇచ్చిన హామీలను ఈ ప్రధాని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 
 
'ఏపీ ప్రజలకు అండగా ఉంటాను. ఎక్కడికి వెళితే అక్కడ మోడీ అబద్దాలు మాట్లాడుతున్నారు. ఆయనపై నమ్మకం పోయింది. ఈ దేశ ప్రజల సెంటిమెంట్ ఎలా ఉంటుందో రెండు నెలల్లో చూపిస్తాం. రాఫెల్‌ గురించి పత్రికల్లో ఏ వార్త వచ్చిందో తెలియదా? చౌకీదార్ చోర్ అయ్యాడు. ఏపీ ప్రజల సొమ్మును .. అనిల్ అంబానీకి దోచి పెట్టారు. మోడీని, బీజేపీని ఓడిద్దాం' అంటూ ధర్మపోరాట దీక్షా వేదిక సందర్భంగా పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments