Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ దేశంలో ఆంధ్రా భాగం కాదా? చౌకీదార్ కాస్త చోర్ అయ్యాడు : రాహుల్ ధ్వజం

Webdunia
సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (12:08 IST)
ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోమారు విమర్శల వర్షం కురిపించారు. చౌకీదార్ కాస్త చోర్ అయ్యారంటూ మండిపడ్డారు. ఏపీకి కేంద్రం చేసిన అన్యాయానికి నిరసనగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ధర్మాపోరాట దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు రాహుల్ గాంధీతో పాటు పలువురు సీనియర్ నేతల తమ సంఘీభావాన్ని ప్రకటించారు. 
 
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ విశ్వసనీయత కోల్పోయారన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేరుస్తారో లేదో చెప్పాలని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఏపీ ఈ దేశంలో భాగం కాదా అని నిలదీశారు. గత ప్రధాని ఇచ్చిన హామీలను ఈ ప్రధాని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 
 
'ఏపీ ప్రజలకు అండగా ఉంటాను. ఎక్కడికి వెళితే అక్కడ మోడీ అబద్దాలు మాట్లాడుతున్నారు. ఆయనపై నమ్మకం పోయింది. ఈ దేశ ప్రజల సెంటిమెంట్ ఎలా ఉంటుందో రెండు నెలల్లో చూపిస్తాం. రాఫెల్‌ గురించి పత్రికల్లో ఏ వార్త వచ్చిందో తెలియదా? చౌకీదార్ చోర్ అయ్యాడు. ఏపీ ప్రజల సొమ్మును .. అనిల్ అంబానీకి దోచి పెట్టారు. మోడీని, బీజేపీని ఓడిద్దాం' అంటూ ధర్మపోరాట దీక్షా వేదిక సందర్భంగా పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments