Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైడ్రాక్సీక్లోరోక్వీన్ మాత్రలను ఎలా తయారు చేస్తారు?

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2020 (14:24 IST)
ప్రపంచంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తున్న వేళ, ప్రపంచ దేశాలన్నీ హైడ్రాక్సీక్లోరోక్వీన్ మందు జపం చేస్తున్నాయి. ఈ మందును భారీ మొత్తంలో దిగుమతి చేసుకునేందుకు అగ్రదేశాలు సైతం పోటీపడుతున్నాయి. ఇలాంటి దేశాల్లో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ వంటి దేశాలు ఉన్నాయి. ఈ దేశాల చూపంతా భారత్‌పై కేంద్రీకృతమైవుంది. దీనికి కారణం.. ఈ ఔషధాన్ని భారీ మొత్తంలో భారత్ ఉత్పత్తి చేయడమే. అలాంటి హైడ్రాక్సీక్లోరోక్వీన్ (హెచ్‌సీక్యూఎస్) మాత్రలను ఏవిధంగా తయారు చేస్తారన్న అంశాన్ని తెలుసుకుందాం. 
 
సౌత్ అమెరికాలో మలేరియా జ్వరానికి విరుగుడుగా సిన్‌చోనా అనే చెట్టు బెరడును వాడుతారు. ఈ చెట్టు బెరడు నుంచి తయారు చేసిందే క్వినైన్. 1930ల నాటికి ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మలేరియా వచ్చింది. దీంతో ఈ క్వినైన్‌ను కృత్రిమంగా రసాయన పదార్థాలతో తయారుచేయాల్సిన నిర్బంధ పరిస్థితి ఏర్పడింది. అపుడు క్లోరోక్విన్ అనే మాత్రలను తయారు చేశారు. 
 
అయితే ఈ మందు వల్ల కొన్ని దుష్ఫలితాలు కూడా ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీంతో 1950లలో క్లోరోక్విన్‌ను మరింత శుద్ధి చేసి దాని తయారీ విధానంలో మార్పులు చేసి హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను తయారుచేశారు. ప్రస్తుతం ఈ మందును మలేరియా, కీళ్లనొప్పులు, లూపస్‌ (ఎస్‌ఎల్‌ఈ) వంటి వ్యాధులకు వినియోగిస్తారు. 
 
ఈ మందు మన శరీరంలో ప్రవేశించిన వెంటనే మలేరియా పరాన్నజీవి కలిగించే వాపును నివారిస్తుంది. అది ఇతర కణాలకు వ్యాపించకుండా అడ్డుకుంటుంది. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా మలేరియాకు ఈ మందులనే వాడతారు. కానీ, అభివృద్ధి చెందిన దేశాల్లో మలేరియా జ్వరాలు పెద్దగా రావుగనుక ఆ దేశాల్లో ఈ మందుల నిల్వలు తక్కువ మోతాదులోనే ఉంటాయి. భారత్‌లో ఈ జ్వరాలు సర్వసాధారణంగా వస్తుండటంతో ఈ మందు నిల్వలు ఇతర దేశాలతో పోల్చితే పుష్కలంగా ఉన్నాయి. అందుకే ప్రస్తుతం అన్ని దేశాల చూపు భారత్‌పై కేంద్రీకృతమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

తర్వాతి కథనం
Show comments