మరో వివాదానికి పాప్ ఐకాన్ రిహన్న తెరలేపింది. తన టాప్లెస్ ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఇలాంటి టాప్ లెస్ ఫోటోలను చాలామంది చేస్తుంటారు. కానీ ఈమె తన మెడలో గణేష్ లాకెట్టు ధరించి ఉంది. చిత్రాన్ని రిహన్న ధృవీకరించిన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇప్పుడీ ఫోటో వైరల్గా మారింది.
దేశ రాజధాని ఢిల్లీ శివార్లలో కొనసాగుతున్న రైతుల ఆందోళనకు మద్దతుగా ట్వీట్ చేసిన రిహన్న భారతీయుల నుండి తీవ్రమైన ట్రోల్ ఎదుర్కొంది. అయినప్పటికీ ఆమె వెనక్కి తగ్గలేదు. రిహన్న ఒక నిర్దిష్ట మతాన్ని అగౌరవపరిచినందుకు వివాదంలో పడటం ఇదే మొదటిసారి కాదు.