Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీకి వెన్నుదన్నుగా నిలిచిన ప్రణబ్ - భారత్ క్షోభిస్తోందంటూ ప్రధాని ట్వీట్

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2020 (18:53 IST)
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఢిల్లీకి కొత్త అయిన తనకు అన్ని విధాలా సహాయ సహకారాలందిస్తూ ప్రణబ్ నడిపించారని అప్పట్లో మోడీనే స్వయంగా వ్యాఖ్యానించారు. 
 
ప్రణబ్ పూర్తి స్థాయి కాంగ్రెస్ పార్టీ నేతే అయినా రాష్ట్రపతి అయ్యాక ప్రధాని మోడీకి అన్ని విధాలా సహకరించారు. ఢిల్లీ స్థాయిలో పాలనాపరమైన అనుభవం లేని మోడీకి ప్రణబ్ అండగా నిలిచారు. 
 
నిజానికి బీజేపీకి చెందిన ప్రధాని కావడం వల్ల మోడీని రాష్ట్రపతిగా ఉన్న ప్రణబ్ ఇబ్బంది పెడతారేమో అని కొందరు ఊహించారు. అయితే అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటూ ప్రణబ్ తన పదవీకాలం పూర్తి చేసుకున్నారు. మోడీతో ఆయనకున్న సయోధ్య వల్లే ఇదంతా సాధ్యమైందని పరిశీలకులు చెబుతుంటారు.
 
ప్రణబ్ మృతిపై మోడీ తన ట్విట్టర్ ఖాతాలో సంతాపం వ్యక్తం చేశారు. భారతరత్న ప్రణబ్ ముఖర్జీ అస్తమయంతో భారత్ క్షోభిస్తోందని పేర్కొన్నారు. దేశ అభివృద్థి పథయంలో ఆయన చెరగని ముద్ర వేశారని కొనియాడారు. సమున్నత ఎత్తులకు ఎదిగిన రాజనీతి కోవిదుడు, పండితుడు అంటూ కీర్తించారు. రాజకీయ చిత్రపటంలో అన్ని వర్గాల వారిని మెప్పించి, సమాజంలో అందరి మన్ననలలకు పాత్రుడయ్యారంటూ మోదీ ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments