Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిశను అంత దారుణంగా హతమార్చితే రెండు బెత్తం దెబ్బలంటానా? నాని బ్రదర్స్‌కి అది రాదు: పవన్ కళ్యాణ్

Webdunia
సోమవారం, 9 డిశెంబరు 2019 (19:53 IST)
దిశపై అత్యాచారం చేసి అత్యంత దారుణంగా హతమార్చిన ఘటనలో తను నిందితులకు రెండు బెత్తం దెబ్బలు వేయాలని చెప్పినట్లు జరుగుతున్న ప్రచారంపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ స్పందించారు. అసలు వైసీపీలోని నాని బ్రదర్స్‌కి తెలుగు భాషలోని పదాలకు అర్థం తెలియకపోవడం వల్లనే ఈ సమస్య అంటూ సెటైర్ వేశారు. 
 
నిందితులు అంత దారుణంగా మహిళను హత్య చేస్తే బెత్తం దెబ్బలతో సరిపెట్టాలని మనిషనేవాడు ఎవరైనా అంటారా అని ప్రశ్నించారు. సింగపూర్ దేశంలో కేనింగ్ అంటారు... అంటే తాట వలిచేయడం, అది కూడా రోడ్డుపై పోకిరీల్లా తిరిగేవారి విషయంలోనే ఈ మాట చెప్పాను. దాన్ని తీసుకెళ్లి దిశ హత్య నిందితులకు ఆపాదించారంటూ వ్యాఖ్యానించారు పవన్ కల్యాణ్. 
 
ఇంకా ఆయన ట్విట్టర్లో ఇలా ట్వీట్ చేశారు. ''శ్రీ జగన్ రెడ్డి గారు నేతృత్వంలో నడుస్తున్న వైసీపీ ప్రభుత్వం మతమార్పిళ్లు, కూల్చివేతలు , కాంట్రాక్టు రద్దులు మీద పెట్టిన దృష్టి ,సగటు ప్రజల అవసరాలు మీద, రైతుల కష్టాల మీద పెట్టుంటే బాగుండేది. మీరు ప్రజలని క్యూలలో నుంచోపెట్టి చంపేకంటే , మీరు నియమించిన గ్రామ వాలంటీర్లను ఉపయోగించి ,ప్రజలు ఇళ్ల దగ్గరికే కిలో 25 రూపాయలకే ఉల్లిపాయల సరఫరా ఎందుకు చేయట్లేదో, Sri Jagan Reddy గారు  వివరణ  ఇవ్వాలి. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యదు అంటారు ,కానీ జగన్ రెడ్డి గారు చేసే మేలు ఉల్లి కూడా చెయ్యదు, అందుకే ఇంకా ఉల్లి ఎందుకు సిల్లీగా, అని దాని రేటు పెంచేశారు'' అని పేర్కొన్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments