Webdunia - Bharat's app for daily news and videos

Install App

పటియాలా లా యూనివర్శిటీలో కరోనా కలకలం - 60 మందికి పాజిటివ్

Webdunia
గురువారం, 5 మే 2022 (10:31 IST)
పంజాబ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. ఈ రాష్ట్రంలోని పటియాలా రాజీవ్ గాంధీ లా విశ్వవిద్యాలయానికి చెందిన 60 మంది విద్యార్థులకు కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. దీంతో ఈ విద్యార్థులందరినీ ఐసోలేషన్‌కు తరలించారు. కరోనా వ్యాప్తిని నిలువరించడానికి వర్శిటీలో హాస్టళ్లలో ఉన్న విద్యార్థులంతా ఈ నెల 10వ తేదీ వరకు హాస్టల్స్ ఖాళీ చేసి తమతమ ఇళ్లకు వెళ్లిపోవాలని విశ్వవిద్యాలయ అధికారులు ఆదేశించారు. 
 
కాగా, ఇటీవలి కాలంలో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న విషయం తెల్సిందే. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఉన్న వెల్హమ్ బాలికల పాఠశాలలో 16 మంది విద్యార్థినిలకు పాజిటివ్ వచ్చింది. అలాగే, ఢిల్లీలోని నోయిడా, ఘజియాబాద్‌లోని ఓ స్కూల్‌లో అనేక మంది విద్యార్థులకు ఈ వైరస్ సోకింది. మద్రాస్ ఐఐటీలో సుమారుగా 200 మంది విద్యార్థులు ఈ వైరస్ బారినపడ్డారు. 
 
ఇదిలావుంటే, గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా మరో 3275 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, 55 మంది చనిపోయారు. 3010 మంది కరోనా బాధితులు ఈ వైరస్ లక్షణాల నుంచి కోలుకున్నారు. కాగా, ఇప్పటివరకు దేశంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,91,393కు చేరుకోగా, మృతులు 5,23,975 మంది ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments