Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిబంధనల పేరుతో మొండికేసిన 108 సిబ్బంది.. బైకుపై మృతదేహం తరలింపు

Webdunia
గురువారం, 5 మే 2022 (10:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబులెన్స్ మాఫియా చేసిన పని ఇటీవల దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తిరుపతి రుయా ఆస్పత్రిలో చనిపోయిన ఓ బాలుడి మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ మాఫియా భారీ మొత్తంలో డిమాండ్ చేసింది. అంత మొత్తంలో డబ్బులు ఇచ్చుకోలేని మృతుని తండ్రి పుట్టెడు దుఃఖంలోనే తన కుమారుడి మృతదేహాన్ని భుజంపై వేసుకుని ద్విచక్రవాహనంపై 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటికి తీసుకెళ్లారు. 
 
ఈ సంఘటన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. అయినప్పటికీ ఏపీలో అంబులెన్స్ డ్రైవర్ల పనితీరు ఏమాత్రం మారలేదు. తాజాగా నెల్లూరులో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. నిబంధనలను సాకుగా చూపి 108 అంబులెన్స్ డ్రైవర్ మృతదేహాన్ని తరలించేందుకు ససేమిరా అన్నారు. దీంతో ఆ తండ్రి తన బిడ్డ మృతదేహాన్ని భుజంపై వేసుకుని మోటారు బైకుపైనే ఇంటికి తీసుకెళ్లారు. ఈ ఘటన జిల్లాలోని సంగంలో జరిగింది. 
 
సంగంకు చెందిన శ్రీరామ్ (8), ఈశ్వర్ (10) అనే ఇద్దరు చిన్నారులు బహిర్భూమికోసం వెళ్లి కనిగిరి రిజర్వాయర్‌ కాలువలో పడి ప్రాణాలు కోల్పోయారు. ఈశ్వర్ మృతదేహాన్ని కాలువ వద్ద నుంచి ఇంటికి తీసుకెళ్లగా, శ్రీరామ్‌ను నీటిలో నుంచి బయటకు తీయగానే స్థానికులు, బంధువులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
అయితే, ఆ బాలుడు కూడా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు 108 వాహన సిబ్బందిని కోరగా, వారు నిరాకరించారు. మృతదేహాలను తరలించేందుకు నిబంధనలు సహకరించవని మొండికేశారు. ఎంతగా బతమిలాడుకున్నప్పటికీ వారు కనికరించకపోవడంతో బిడ్డ శవాన్ని భుజం వేసుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి తరలించారు. ఈ దృశ్యం చూపరులను సైతం కన్నీరు పెట్టించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments