Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అవిశ్వాస తీర్మానం' అడ్డుకట్టకు అన్నాడీఎంకే అస్త్రాన్ని ప్రయోగించిన బీజేపీ

తమపై తెలుగుదేశం పార్టీ ప్రయోగించిన అవిశ్వాస తీర్మాన అస్త్రానికి విరుగుడుగా అన్నాడీఎంకే అస్త్రాన్ని అధికార భారతీయ జనతా పార్టీ ప్రయోగించింది. ఆ పార్టీ ద్వారా సభలో రభస చేయించి, సభా కార్యక్రమాలు ఆర్డర్‌లో

Webdunia
సోమవారం, 19 మార్చి 2018 (12:36 IST)
తమపై తెలుగుదేశం పార్టీ ప్రయోగించిన అవిశ్వాస తీర్మాన అస్త్రానికి విరుగుడుగా అన్నాడీఎంకే అస్త్రాన్ని అధికార భారతీయ జనతా పార్టీ ప్రయోగించింది. ఆ పార్టీ ద్వారా సభలో రభస చేయించి, సభా కార్యక్రమాలు ఆర్డర్‌లో లేకుండా చేస్తూ, అవిశ్వాస తీర్మాన నోటీసు చర్చకు రాకుండా అడ్డుకోవాలని కమలనాథులు వేసిన ఎత్తుగడ పూర్తిగా ఫలించింది. ఫలితంగా 37 మంది ఎంపీలు కలిగిన అన్నాడీఎంకే సభ్యులు ఏకమై కావేరీ జల బోర్డును ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియంను చుట్టిముట్టి రభస చేశారు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా ఈ రభసను సాకుగా చూపి సభను వాయిదా వేశారు. శుక్రవారం ఇదేవిధంగా వాయిదా వేయగా, సోమవారం కూడా సభను మంగళవారానికి వాయిదావేశారు. దీంతో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చే ఆస్కారమే లేకుండా పోయేలా కనిపిస్తోంది. 
 
నిజానికి ప్రధాని మోడీ సర్కారుపై తెలుగుదేశం, వైకాపాలు లోక్‌సభలో అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చారు. ఈ విషయాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా సభలో ప్రకటించారు. అయితే, ఆ అవిశ్వాస తీర్మానం సోమవారం కూడా చర్చకు రాలేదు. ఉదయం 11 గంటలకు మొదలైన సభ క్షణాల్లోనే 12 గంటల వరకూ వాయిదా పడగా, ఆపై 12 గంటలకు సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా పలు పార్టీల సభ్యులు నినాదాలతో సభను హోరెత్తించారు. 
 
ప్రశ్నోత్తరాలను చేపట్టాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రయత్నించి విఫలమయ్యారు. సభ ఆర్డర్‌లో లేదంటూ, అవిశ్వాసంపై చర్చించాలని ఉన్నప్పటికీ, కుదిరేలా లేదన్న ఆమె, సభను రేపటి (మంగళవారం)కి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అంతకుముందే రాజ్యసభ కూడా రేపటికి వాయిదా పడింది. కేంద్రం అవిశ్వాస తీర్మానంపై మొండి వైఖరిని అవలంభిస్తోందని, అందుకే సోమవారం కూడా చర్చ చేపట్టలేదని వైసీపీ, టీడీపీ ఎంపీలు ఆరోపించారు. తాము మరింతగా నిరసనలు తెలియజేస్తామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trisha: కాలేజీలో మహేష్ బాబుతో హాయ్-బై అనుకునేవాళ్లం.. కలిసి నటిస్తామని అనుకోలేదు.. త్రిష

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments