Webdunia - Bharat's app for daily news and videos

Install App

శబరిమలలో మహిళపై కారం స్ప్రే చల్లిన ఆందోళనకారులు

Webdunia
మంగళవారం, 26 నవంబరు 2019 (12:48 IST)
శబరిమలలో బిందు అనే మహిళపై కారం స్ప్రే కొట్టారు ఆందోళనకారులు. ఆమె కళ్లలోకి కారం, పెప్పర్ చల్లి దాడికి పాల్పడ్డారు. ఎర్నాకుళం సిటీ పోలీస్ క‌మీష‌న‌ర్ ఆఫీసు ఎదుట మంగళవారం ఈ ఘటన జరిగింది.

వాస్తవానికి ఈ మహిళ గత జనవరిలో అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. ఆ కోపంతోనే ఆమెపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళలు ప్రవేశించరు. 
 
కానీ సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో అయ్యప్ప స్వామి ఆలయంలోని స్వామిని మహిళలు దర్శించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బిందు అనే మహిళ అయ్యప్ప స్వామిని దర్శించుకుందనే కోపంతో ఆందోళనకారులు ఆమెపై మంగళవారం ఉదయం మిరియాలు, మిరపపొడి కలిపిన స్ప్రేని కొట్టారు. 
 
అయితే ఆమెపై స్ప్రే చల్లలేదని.. మిరపపొడి చల్లితే అంత సాఫీగా మీడియాకు ఆమె ఇంటర్వ్యూ ఇవ్వదని ఆ ప్రాంత వాసులు ఆరోపించారు. అయితే సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు తర్వాతే తాను స్వామిని దర్శించుకున్నానని తెలిపింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments