Webdunia - Bharat's app for daily news and videos

Install App

మత్తుమందు ఇచ్చి అత్యాచారం.. ఆ ఫోటోలతో బెదిరింపులు

Webdunia
మంగళవారం, 26 నవంబరు 2019 (12:19 IST)
విశాఖలో మహిళపై అత్యాచారానికి పాల్పడిన కీచకుడు ఆమెను నగ్నంగా ఫోటోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డాడు. వాటి ద్వారా బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతూ ఆ తర్వాత కూడా ఆమెపై పలుసార్లు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అంతటితో ఆగకుండా తనకు డబ్బులు ఇవ్వాలంటూ వేధింపులకు దిగాడు. పలుసార్లు డబ్బులు ఇచ్చినా అతడి వేధింపులు మాత్రం ఆగలేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
వివరాల్లోకి వెళితే.. విశాఖకు చెందిన ఓ మహిళ ప్రభుత్వ ఉద్యోగం చేస్తోంది. దీంతో ఆమెను ట్రాప్ చేసిన ఓ వ్యక్తి పరిచయం పెంచుకున్నాడు. ఆమెతో సన్నిహితంగా మెలిగాడు. ప్లాన్ ప్రకారం ఆమెకు మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. అతర్వాత ఆమెను నగ్నంగా ఉన్న ఫోటోలను తీశాడు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించాడు. 
 
ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేసి ఆమెపై మరోసారి అత్యాచారం చేశాడు. డబ్బు కావాలంటూ బెదిరించాడు. పరువు పోతుందని భావించిన బాధితురాలు... అప్పులు చేసి మరీ అతగాడికి రూ.50 లక్షల వరకు డబ్బు అంటగట్టింది. ఈ దారుణానికి అతడి తల్లిదండ్రులు కూడా వంతపాడారు. చివరికి అతడి ఆగడాలను ఆపలేకపోయిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments